Don't Miss!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ఇక కాల్షీట్లన్నీ ఉపాసనవే: రామ్ చరణ్
హైదరాబాద్ : ''పెళ్లయ్యాక ఇంటి పట్టున ఉన్నది తక్కువ. ఎప్పుడూ షూటింగుల హడావుడినే. నెలకు మహా అయితే నాలుగు రోజులు ఉండేవాణ్నేమో. ఈసారి మాత్రం ఉపాసనకు సమయం కేటాయించాలనుకొంటున్నా'' అంటున్నారు రామ్చరణ్.
'ఎవడు', 'జంజీర్' సినిమాల బిజీ షెడ్యూలుతో యేడాది కాలంగా ఆయనకు క్షణం తీరిక లేదు. ఇటీవలే 'జంజీర్' పూర్తయింది. అందుకే కొన్ని రోజులు సెలవు తీసుకొన్నారు. తన కాల్షీట్లన్నీ అర్థాంగి ఉపాసనకు ఇచ్చేశారు.
ప్రస్తుతం చరణ్ సతీసమేతంగా స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరంలో ఉన్నారు. ఆ తరవాత ఆయన అక్కడే 'ఎవడు' షూటింగ్లో పాల్గొంటారు. ఇక శ్రుతిహాసన్ కూడా స్విస్లోనే ఉంది. 'ఎవడు'లో శ్రుతి హీరోయిన్ గా నటిస్తుంది.
షూటింగ్కి ముందే శ్రుతి స్విస్ వెళ్లింది. కొన్ని రోజులు అక్కడ విరామం తీసుకొంటుంది. ఆ తరవాత 'ఎవడు' షూటింగ్లో పాల్గొంటుంది. చరణ్-శ్రుతిలపై రెండు గీతాల్ని తెరకెక్కిస్తారు. అలా వేసవి నుంచి ఈ హీరో,హీరోయిన్స్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.