Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ రాజకీయం: అది మనసులో పెట్టుకున్నారా? బన్నీ మౌనం.... ఫ్యాన్స్ రచ్చ!
Recommended Video
ఆ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానులు, అల్లు అర్జున్ మధ్య 'చెప్పను బ్రదర్' వివాదం రేగిన సంగతి తెలిసిందే. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బన్నీని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో రచ రచ్చ చేశారు. చాలా రోజుల తర్వాత మళ్లీ బన్నీ గురించి పవన్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తాజాగా నెలకొన్న కొన్ని పరిస్థితులే అందుకు కారణం.
మరోసారి బన్నీని టార్గెట్ చేశారు, ఎందుకంటే?
తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానులు బన్నీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ క ళ్యాణ్ రాజకీయాత్ర ప్రారంభించిన నేపథ్యంలో ఈ ఇష్యూ తెరపైకి వచ్చింది.
ట్వీట్స్ చేసిన మెగా హీరోలు
పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర ప్రారంభమైన నేపత్యంలో రామ్ చరణ్ మరియు మెగా ఫ్యామిలీ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్లు పవన్ కళ్యాణ్ కు 'ఆల్ ది బెస్ట్' చెబుతూ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
బన్నీ స్పందించక పోవడమే
అయితే అల్లు అర్జున్ మాత్రం పవన్ రాజకీయ యాత్రపై స్పందించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బన్నీ విషెస్ చెప్పక పోవడాన్ని కొందరు పవర్ స్టార్ ఫ్యాన్స్ తప్పుబడున్నారు. బన్నీ కూడా విష్ చేసి ఉంటే బావుండేదని, అతడు విష్ చేయక పోవడం వల్ల ..... ఇద్దరి మధ్య ఏదో క్లాష్ ఉందనే సంకేతాలు వెళుతున్నాయని అంటున్నారు.
అల్లు శిరీష్ కూడా
బన్నీ కంటే యాక్టివ్గా అతడి బ్రదర్ అల్లు శిరీష్ కూడా పవన్ రాజకీయ ప్రవేశంపై స్పందించలేదు. కావాలనే ‘అల్లు' వారు పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీకి అంటీ ముట్టనట్లు ఉంటున్నారని అభిమానుల్లో చర్చ సాగుతోంది.
అది మనసులో పెట్టుకున్నారా?
అల్లు అరవింద్ మీద పవన్ కళ్యాణ్ ఇటీవల ఆసక్తకర కామెంట్స్ చేశారు. "ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడతావా? అంటూ కొందరు నన్ను ప్రశ్నించొచ్చని కానీ.. తాను అప్పట్లో నిస్సహాయుడ్ని అంటూ ఒక ఉదాహరణను చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ను ఫలానా చోటికి ప్రచారానికి పంపించండి అంటే దానికి అల్లు అరవింద్ స్పందిస్తూ.. ఎందుకండి మనకు అల్లు అర్జున్ ఉన్నాడు.. రామ్ చరణ్ ఉన్నాడుగా.. పంపించేయండి అన్నారని, అప్పట్లో తనకు అర్థమైందేమిటంటే.. అల్లుఅరవింద్ తనను నటుడిగానే చూశారని.. తన కొడుకు.. మేనల్లుడితో పాటు పవన్ కళ్యాణ్ అనే వాడు ఒక నటుడు మాత్రమేనని భావించారు" అని పవర్ స్టార్ వ్యాఖ్యానించారు. బహుషా ఈ కామెంట్స్ను మనసులో పెట్టుకుని ‘అల్లు'వారు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు, జనసేనకు దూరంగా ఉంటున్నారా? అని చర్చించుకుంటున్నారు.
అల్లు అరవింద్ మీద పవన్ కామెంట్స్
‘‘అల్లు అరవింద్కు తనలో నటుడు మాత్రమే కనిపించాడు. నాలోని సామాజిక స్పృహ కనిపించలేదన్న విషయం అర్థమైంది. అలాంటి వాతావరణంలో తానేం మాట్లాడినా ఎవరు మాత్రం వింటారని.. అందుకే ప్రజారాజ్యంలో ఏం జరుగుతున్నా ఏమీ అనలేక చేతులు కట్టుకొని రోదించేవాడినని.. కన్నీళ్లు కూడా బయటకు వచ్చేవి కావు. ఈ రోజున తనకు బలం ఉంది.. అనుభవం ఉంది. ప్రజారాజ్యం టైంలో తాను చెబితే వినేలా పరిస్థితులు లేవు..... అంటూ పరోక్షంగా అల్లు అరవింద్ మీద పవన కళ్యాణ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
అందుకే ‘అల్లు' వారు దూరంగా
తన తండ్రిని పరోక్షంగా టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన కామెంట్లతో....... ‘అల్లు' వారు అలకబూనారని, అందుకే వారు పవన్ కళ్యాణ్ పొలిటికల్ యాత్రపై స్పందించడం లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు.
బాబాయ్ని విష్ చేసి రామ్ చరణ్
రాజకీయ యాత్ర ప్రారంభించిన బాబాయ్ కి అభినందనలు తెలుపుతూ రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఓ సందేశం పోస్టు చేశారు.
ఆల్ ది బెస్ట్ చెప్పిన వరుణ్
బాబాయ్ పవన్ కళ్యాణ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ విష్ చేసిన వరుణ్ తేజ్.
సాయి ధరమ్ తేజ్
మీ వెంటే మేము అంటూ సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ సందేశం.