Don't Miss!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
ఈ రోజు నుంచే రామ్ చరణ్...
హైదరాబాద్: రామ్చరణ్, కాజల్ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మాత. శివబాబు బండ్ల సమర్పిస్తున్న ఈ చిత్రం పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. . శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు నుంచి పొల్చాచ్చిలో షూటింగ్ జరుగుతోంది. కుటుంబ నేపథ్యంలో వచ్చే కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. చరణ్తోపాటు ప్రధాన తారాగణమంతా చిత్రీకరణలో పాల్గొంటోంది.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ "ఫిబ్రవరి 6న మా సినిమా రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభించాం. ఇటీవల కన్యాకుమారిలోని చక్కటి లొకేసన్లలో చిత్రీకరించాం. రామ్చరణ్, శ్రీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కించిన సన్నివేశాలు బాగా వచ్చాయి. ఆదివారం నుంచి పొల్లాచ్చిలో కొన్ని సన్నివేశాలు, ఒక పాటను చిత్రీకరిస్తాం. సినిమా అందరి అంచనాలను అందుకునేలా ఉంటుంది. శ్రీకాంత్, కమలిని ముఖర్జీ జంటగా నటిస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా కృష్ణవంశీ తెరకెక్కిస్తున్నారు'' అని అన్నారు.
అలాగే... ''కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, తెలుగు సంప్రదాయాలు కలగలిపి తీర్చిదిద్దుకున్న కథ ఇది. సినిమాలో రామ్చరణ్ కొత్తగా కనిపిస్తాడు. శ్రీకాంత్ ఇందులో రామ్చరణ్కి యంగ్ బాబాయిగా కనిపిస్తారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. తమిళ నటుడు రాజ్కిరణ్ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగర్కోయిల్, పొల్లాచ్చిలోనూ చిత్రీకరణ జరుపుతాము''అన్నారు.
ఈ చిత్రంలో చరణ్ విదేశాల్లో చదువుకొనే ఓ యువకుడిగా నటిస్తాడని తెలుస్తోంది. మే నుంచి విదేశాల్లో చిత్రీకరణ జరుపుతారని సమాచారం. ''కుటుంబ అనుబంధాలతో పాటు, చరణ్ శైలికి తగ్గ మాస్ అంశాలు కూడా చిత్రంలో ఉంటాయి''అని నిర్మాత చెబుతున్నారు. నలభై రోజులపాటు ఈ షెడ్యూల్ సాగుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కృష్ణవంశీ మాట్లాడుతూ... తాను ప్రస్తుతం రామ్ చరణ్ తో 'మురారి' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు తండ్రిగా నాగార్జునని అడుగుతున్నారని తెలుస్తోంది. తాతగా రాజ్ కిరణ్ కనిపించనున్నాడు.
ఈ చిత్రంలో తమిళంలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన రాజ్ కిరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు బండ్ల గణేష్. ఈ చిత్రానికి కెమెరా: సమీర్రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.