Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షాక్లో సైరా టీమ్, తెల్లవారుజామున 3 గంటల వరకు.. 40 కోట్లు పెట్టేసిన రాంచరణ్!
Recommended Video
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రానికి నిర్మాత. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అబ్బురపరిచే విధంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క వార్ సీన్ కోసం 40 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
శరవేగంగా షూటింగ్
సైరా చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలనే ఆలోచనలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. 60 ఏళ్ల వయసులో కూడా చిరు ఎంతో ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం.
షాక్ లో చిత్ర యూనిట్
ప్రస్తుతం హైదరాబాద్ శివారులో సైరా షూటింగ్ జరుగుతోంది. యుద్ధ సన్నివేశాలని దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. తెల్లవారు జాము 3 గంటలవరకు కూడా షూటింగ్ కొనసాగుతోంది. అయినప్పటికీ మెగాస్టార్ చిరు చాలా ఎనర్జిటిక్ గా షూటింగ్ లో పాల్గొంటున్నారు. మెగాస్టార్ ఎనర్జీతో చిత్ర యూనిట్ మొత్తం ఆశ్చర్యపోతున్నారు.
40 కోట్లుతో యుద్ధం
యుద్ధ సన్నివేసాల కోసం ప్రత్యేకమైన సెట్స్ నిర్మించారు. ప్రస్తుతం జరుగుతున్న వార్ ఎపిసోడ్స్ కి రాంచరణ్ ఏకంగా 40 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. సైరా ఏస్థాయిలో నిర్మించబడుతోందో అని.
ఇంగ్లాండ్ నుంచి
బ్రిటీష్ వారితో సైరా యుద్ధం చేసే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ వార్ ఎపిసోడ్స్ కోసం 40 మంది విదేశాయులని ఇంగ్లాండ్ నుంచి రప్పించినట్లు తెలుస్తోంది.