ఏ సినిమా చేయాలో అర్దంకాక సతమతమవుతున్న రామ్ చరణ్ తేజ్
మగధీర హిట్ తో ఎంత పాపులారిటి సంపాదించాడో, ఆరెంజ్ ప్లాఫ్ తో అంత డౌన్ అయ్యాడు రామ్ చరణ్ తేజ్. ఈ చిత్రం చరణ్ ను, ఆయన అభిమానులను ఎంతో డిజప్పాయింట్ చేసింది. ఇప్పుడిప్పుడే ఆరెంజ్ షాక్ నుంచి కోలుకుంటున్న చరణ్ తన తదుపరి చిత్రం వేటలో వున్నాడు. ధరణి దర్శకత్వంలో రూపొందనున్న మెరుపు చిత్రం బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.
ఇక చరణ్ తదుపరి చిత్రం ఏమిటి అనే కన్ఫ్యూజన్ లో వున్నాడు. అయితే ఈ మగధీరుడు త్వరలో గమ్యం, వేదం చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడట. ఈ కధ కూడా పూర్తి క్లాస్ గా ఉండటంలో మళ్శీ రామ్ చరణ్ తేజ్ ఆలోచనలో పడ్డాడు. ఇది మాత్రమే కాకుండా ఈసారి రిలీజ్ అవ్వబోయే సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











