Don't Miss!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
థాంక్యూ రామ్ చరణ్ గారు.. పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్
కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్నందుకు, ప్రజలంతా ఒకేత్రాటిపై ఉన్నారని ప్రపంచానికి చాటు చెప్పేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓ వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దేశ ప్రజలంతా ఒంటరి వారు కారని, తామంతా ఒక్కటేనని, తమ సమగ్రతను చాటి చెప్పాలని, అందుకు ఆదివారం రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు ఇంట్లో లైట్స్ ఆర్పివేసి దీపాలను వెలిగించాలని ప్రధాని సూచించిన సంగతి తెలిసిందే.
ప్రధాని ఇచ్చిన ఈ సందేశానికి సెలెబ్రిటీలంతా తమ మద్దతును ప్రకటిస్తున్నారు. బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా అందరూ ప్రధాని నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్, రంగోలీ చందేల్ ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించాలని సూచించారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ప్రధాని నిర్ణయానికి జై కొట్టారు.
తాజాగా రామ్ చరణ్ సైతం ప్రధాని నిర్ణయానికి మద్దతు తెలుపుతూ.. ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు. ప్రధాని చెప్పినట్టు ఆదివారం రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు ఇంట్లోని లైట్స్ ఆర్పి వేసి దీపాలు వెలిగిద్దామని అభిమానులకు సూచించాడు. మనమంతా కలిసి కరోనా లేని భారతాన్ని చూడాలని కాంక్షించాడు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ప్రధాని నిర్ణయాన్ని సమర్థించినందుకు థాంక్యూ రామ్ చరణ్ గారూ..అంటూ ట్వీట్ చేశాడు.
Thank you Ramcharan ji @AlwaysRamCharan for taking forward the https://t.co/83OmZ9biYX Sri @narendramodi’s message forward. @v_shrivsatish @blsanthosh @BJP4India https://t.co/wk0oP82dF8
— Pawan Kalyan (@PawanKalyan) April 4, 2020