Don't Miss!
- Finance IT News: CEO మైండ్ బ్లాంక్ చేసిన IT ఉద్యోగి.. నెట్టింట పోస్ట్ వైరల్.. ఆ ఒక్క మాటతో..
- News తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు నేడే: కాంగ్రెస్ సిఈసి భేటీకి సీఎం రేవంత్ రెడ్డి!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
కుక్కతో రామ్ చరణ్ ఫన్నీగా....(ఫోటో)
హైదరాబాద్ : సినిమా షూటింగులతో బిజీగా గడిపే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి రాగానే తన పెంపుడు కుక్క బ్రాట్ తో గడుపుతూ రిలాక్స్ అవుతున్నాడు. తాజాగా రామ్ చరణ్ బ్రాట్తో కలిసి స్విమ్మింగ్ ఫూల్లో జలకాలాడుతున్న ఫోటోను సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసాడు.
బ్రాట్ అంటే రామ్ చరణ్ కు ఎంతో ఇష్టం. దాని కోసం శాఖాహారిగా మారారు. ఆయనకు ఆ కుక్కను ఉపాసన గిప్ట్ గా ఇచ్చిందట. ఆ కుక్క గురించి రామ్ చరణ్ గతంతో మాట్లాడుతూ..."నాకు నా వైఫ్ ఉపాసన నా పుట్టిన రోజు గిఫ్టుగా దీన్ని నాకు ఇచ్చింది' అని తెలిపారు.
'ఆ కుక్కను మొదటి సారి చూడగానే నాలో పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగాయి. నా భార్య ఏం పేరు పెడదాము అని అడిగిన వెంటనే వేరే ఆలోచన లేకుండా బ్రాట్ అని పెట్టాను. బ్రాట్ అనేది నా దగ్గర పెరిగిన అంతకు ముందు కుక్క పేరు. అది నా అజాగ్రత్త వల్ల నా చేతుల్లోనే చనిపోయింది. ఆ కుక్క నాతో 18 నెలలే ఉంది కానీ చాలా అనుబంధం పెంచుకుంది. అందుకే ఈ కుక్కకు ఆ పేరు పెట్టాను' అంటున్నాడు చరణ్.
రామ్ చరణ్ ఈ కుక్క పట్ల ఎంత ప్రేమను పెంచుకున్నారంటే...ఇటీవల ఆ కుక్క కాలుకు ప్యాక్చర్ అయితే...కాలులో రాడ్ వేసారు. దీనిపై రామ్ చరణ్ స్పందిస్తూ....'దాని పెయిన్ చూస్తే చాలా బాధ వేసింది. త్వరగా అది కోలుకుని పరుగెత్తాలని కోరుకున్నా..అప్పటివరకూ నేను నాన్ వెజ్ ఫుడ్ వదిలేయాలనుకున్నాను. ఈ మధ్యనే దాని కాలులోంచి రాడ్ తీసేసారు. అది పూర్తిగా రికవరి అయ్యి పరుగెత్తాలని కోరుకుంటున్నా. అది బాగుండటం కోసం ఏదైనా చేస్తాను. " అని ఎమోషన్ ల్ గా చెప్పుకొచ్చారు.
ఇక రామ్చరణ్ తాజా సినిమా 'ఎవడు' విషయానికొస్తే... ఈ చిత్రంలో శ్రుతిహాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 21 న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రం మగధీర రేంజి హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారంతా.