Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గురూ... నన్ను వదిలిపెట్టండి.. నా పని చూసుకొంటా.. రాజమౌళికి రాంచరణ్ రిక్వెస్ట్!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ అటు హీరోగా నటిస్తూనే.. ఇటు నిర్మాతగా కూడా టాలీవుడ్లో సత్తా చాటుతున్నాడు. తండ్రి మెగాస్టార్ చిరంజీవితో భారీ ప్రాజెక్ట్ను ఓ వైపు తెరకెక్కిస్తూనే మరోవైపు RRR సినిమాలో నటిస్తున్నాడు. సైరాను జాతీయ స్థాయిగా తీర్చిదిద్ది.. భారీగా ప్రమోషన్ చేయాలనే ప్రయత్నాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తన కారణంగా RRR షెడ్యూల్ వాయిదా పడిన విషయాన్ని గుర్తుంచుకొన్న చెర్రీ.. మరోసారి దర్శకుడు రాజమౌళిని బుజ్జగించే పనిలో పడ్డారట. అసలు ఏం జరిగిందంటే..
సైరా ప్రమోషన్ కోసం
RRR లాంటి క్రేజీ ప్రాజెక్ట్తో భాగమవ్వడమంటే ఏ హీరోకైనా మామూలు విషయం కాదు. ఇక రాజమౌళి ప్రాజెక్ట్ అంటే హీరో అన్ని వదులుకోవాల్సిందే. అదే క్రమంలో రాంచరణ్ కూడా వచ్చే ఏడాది జూన్ వరకు బిజీగా ఉండబోతున్నాడు. ఈ మధ్యలోనే సైరాను రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందస్తు అగ్రిమెంట్లో భాగంగానే సైరా ప్రమోషన్ కోసం తనను వదిలిపెట్టాలని ఇటీవల జక్కన్నను అడిగారట.
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజున
సినిమా నిర్మాణంలో సాధకబాధకాలు తెలిసిన రాజమౌళి.. రాంచరణ్కు కొన్ని రోజులు వెసులుబాటు కలిగించేందుకు ఓకే అన్నారట. ఈ నేపథ్యంలో తన తండ్రి బర్త్ డే ఆగస్టు 22 నుంచి సైరా నర్సింహారెడ్డి ప్రమోషన్స్ను అగ్రెస్సివ్గా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మెగాస్టార్ పుట్టిన రోజున ఆడియోను లాంచ్ చేయడమే కాకుండా.. ఫ్యాన్స్ కానుకగా ట్రైలర్ కూడా ఆవిష్కరించబోతున్నారనేది తాజా సమాచారం.
రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్
సైరా బిజినెస్ను కూడా రాంచరణ్ రికార్డు స్థాయిలో చేస్తున్నట్టు సమాచారం. సైరా హక్కులను తిరుగులేని విధంగా భారీ మొత్తానికి అమ్మడం జరిగిందట. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు హక్కులను యూవీ క్రియేషన్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్మినట్టు సినీ వర్గాల సమాచారం. అంతేకాకుండా కన్నడ థియేట్రికల్ హక్కులను రూ.30 కోట్లకు అమ్మినట్టు తెలసిింది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్నది.
అక్టోబర్ 2న విడుదల
ఇక హిందీ థియేట్రికల్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ, పంపిణీ సంస్థకు భారీ రేటుకు అమ్మినట్టు సమాచారం. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను గోప్యంగా ఉంచినట్టు తెలుస్తున్నది. మెగాస్టార్ చిరంజీవి, నయనతార, అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీన విడుదలకు ముస్తాబవుతున్నది.