twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీవారి కోసం చరణ్-తమన్నా....

    By Bojja Kumar
    |

     Ram charan
    తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని సినీ తారలు రామ్ చరణ్, తమన్నాలు సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. రచ్చ సినిమా షూటింగులో భాగంగా తిరుపతి వచ్చిన ఈ ఇద్దరు పనిలో పనిగా ఏడుకొండలవాడి ఆశీర్వాదం తీసుకున్నారు. దర్శనానికి ముందు మీడియా ప్రతినిధులు రామ్ చరణ్ తో మాట్లాడానికి ప్రయత్నించగా చెర్రీ కోపంగా కసురుకుని, దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. తన పెళ్లి గురించి, ఉపాసన గురించి మీడియాలో వస్తున్న కొన్ని అభ్యంతరకర వార్తల నేపథ్యంలోనే చరణ్ ఇలా ప్రవర్తించినట్లు స్పష్టం తెలుస్తోంది.

    రచ్చ సినిమాకు ఏమైంది ఈ వేళ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన తమన్నా రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రంలో తన తండ్రి చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలోని ఓ పాట రీమిక్స్ లో చరణ్ స్టెప్పులేయనున్నాడు. చిరంజీవి నటించిన 'ఘరానా మొగుడు' సినిమాలోని 'బంగారు కోడీ పెట్ట…' పాటను రీమిక్స్ చేసి 'మగధీర' సినిమాలో స్టెప్పులేసి క్రేజ్ పెంచుకొన్న మెగాపవర్ స్టార్ మళ్ళీ రచ్చతో రచ్చచేసేయనున్నాడు. రచ్చ సినిమాను మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ పై ప్రసాద్ జైన్, ఎన్ వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆర్ బి చౌదరి ఈ చిత్రానికి సమర్పకులు. మణి శర్మ సంగీతం అందించారు.

    English summary
    Ram charan and Tamanna make pooja at Tirumala Sri Venkateswara swamy temple.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X