Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మగధీర గురించి రామ్ చరణ్ తేజ
త్వరలో విడుదల కానున్న తన మగధీర చిత్రం గురించి హీరో రామ్ చరణ్ తేజ మీడియాతో మాట్లాడారు. 'మగధీర' అనుభవాల్ని చరణ్ వివరిస్తూ..."గుజరాత్లో తీసిన గుర్రం ఎపిసోడ్స్ ఈ సినిమాకే హైలైట్గా నిలుస్తాయి. అలాగే 'బంగారు కోడిపెట్ట...' పాట కూడా. ఒకప్పుడు నాన్నగారు అదరగొట్టేసిన ఈ పాటను ఇప్పుడు నేను చేస్తుంటే చాలా ఉద్వేగపడ్డాను. ఇక కీరవాణి అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రాణం. కచ్చితంగా ఈ సినిమా రీ-రికార్డింగ్ ట్రాక్స్ని ఆడియో సీడీలుగా రిలీజ్ చేయొచ్చు. మహామహులైన టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేశారు. కెమెరామన్ సెంథిల్కి హేట్సాఫ్ చెప్పాలి. అంత బాగా ఫొటోగ్రఫీ సమకూర్చారాయన' అని తెలిపారు.ఇక ఈ సినిమా తనకే కాదు తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలుస్తుందనే అంచనాలో ఉన్నారు చరణ్. నిజంగా ఈ సినిమా చేయడం తన అదృష్టమని చెబుతున్నారాయన. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో...భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదలకు సిద్ధమవుతోంది. కాజల్ అగర్వాల్, శ్రీహరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సహనిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్.