Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎక్కడికి వెళ్లినా ముందుగా నా కన్ను: రామ్ చరణ్
హైదరాబాద్ : రామ్చరణ్ కి జీన్స్ ప్యాంట్లంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్లినా ముందుగా అతడి కన్ను జీన్స్మీదే పడుతుంది. విదేశాలకి వెళ్లాడంటే కనీసం ఓ నాలుగైదు కొత్త జీన్స్ కొనుక్కుని వస్తుంటాడు. అన్ని రకాల మోడళ్లూ అన్నిరకాల రంగుల జీన్స్ వేసుకుంటుంటాడు. అలాగని పాతవాటిని పాడెయ్యడు.
ఈ విషయమై చెర్రీ మాట్లాడుతూ... 'నా దగ్గర చాలాచాలా జీన్స్ ఉన్నాయి. కొత్తది కొన్నాను కదా అని పాతదాన్ని వదిలేయలేను. వాడినా వాడకపోయినా వాటిని భద్రంగా దాచుకుంటున్నాను. ప్యాంట్లని పారేయడం నాకు నచ్చదు' అంటున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ 'జంజీర్' వంటి ప్రతిష్టాత్మక చిత్రంతో ఆయన బాలీవుడ్ లో తెరంగేట్రం చే స్తున్నారు. ఈ చిత్రం 'తుఫాన్'గా తెలుగు ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఇదిలా వుండగా రామ్చరణ్ నటిస్తోన్న 'ఎవడు' చిత్రం హైదరాబాద్లో కీలక ఘట్టాల చిత్రీకరణ జరుపుకుంటోంది. శ్రీ వెంక క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకుడు. శృతిహాసన్, అమి జాక్సన్ హీరోయిన్స్ .
'ఎవడు'చిత్రం తొంభైశాతం చిత్రీకరణ పూర్తయింది. రెండు పాటలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ బ్యాలెన్స్గా వున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించిన పాటల్ని మే 9న విడుదల చేయబోతున్నారు. జూన్ 14న సినిమాను విడుదల చేస్తారు. ప్రత్యేక పాత్రల్లో అల్లుఅర్జున్, కాజల్అగర్వాల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్చరణ్ అభిమానుల్ని అలరించే అంశాలన్నీ వున్నాయి . యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని దర్శకుడు వంశీపైడిపల్లి తెలిపారు. ఈ చిత్రానికి కథ: వంశీపైడిపల్లి, వక్కంతం వంశీ, మాటలు: అబ్బురి రవి, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్.