Don't Miss!
- News తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు నేడే: కాంగ్రెస్ సిఈసి భేటీకి సీఎం రేవంత్ రెడ్డి!!
- Finance Telecom News: వినియోగదారులకు టెలికాం కంపెనీల వాత.. ముహూర్తం ఫిక్స్..
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ఎక్కడికి వెళ్లినా ముందుగా నా కన్ను: రామ్ చరణ్
హైదరాబాద్ : రామ్చరణ్ కి జీన్స్ ప్యాంట్లంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్లినా ముందుగా అతడి కన్ను జీన్స్మీదే పడుతుంది. విదేశాలకి వెళ్లాడంటే కనీసం ఓ నాలుగైదు కొత్త జీన్స్ కొనుక్కుని వస్తుంటాడు. అన్ని రకాల మోడళ్లూ అన్నిరకాల రంగుల జీన్స్ వేసుకుంటుంటాడు. అలాగని పాతవాటిని పాడెయ్యడు.
ఈ విషయమై చెర్రీ మాట్లాడుతూ... 'నా దగ్గర చాలాచాలా జీన్స్ ఉన్నాయి. కొత్తది కొన్నాను కదా అని పాతదాన్ని వదిలేయలేను. వాడినా వాడకపోయినా వాటిని భద్రంగా దాచుకుంటున్నాను. ప్యాంట్లని పారేయడం నాకు నచ్చదు' అంటున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ 'జంజీర్' వంటి ప్రతిష్టాత్మక చిత్రంతో ఆయన బాలీవుడ్ లో తెరంగేట్రం చే స్తున్నారు. ఈ చిత్రం 'తుఫాన్'గా తెలుగు ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఇదిలా వుండగా రామ్చరణ్ నటిస్తోన్న 'ఎవడు' చిత్రం హైదరాబాద్లో కీలక ఘట్టాల చిత్రీకరణ జరుపుకుంటోంది. శ్రీ వెంక క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకుడు. శృతిహాసన్, అమి జాక్సన్ హీరోయిన్స్ .
'ఎవడు'చిత్రం తొంభైశాతం చిత్రీకరణ పూర్తయింది. రెండు పాటలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ బ్యాలెన్స్గా వున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించిన పాటల్ని మే 9న విడుదల చేయబోతున్నారు. జూన్ 14న సినిమాను విడుదల చేస్తారు. ప్రత్యేక పాత్రల్లో అల్లుఅర్జున్, కాజల్అగర్వాల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్చరణ్ అభిమానుల్ని అలరించే అంశాలన్నీ వున్నాయి . యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని దర్శకుడు వంశీపైడిపల్లి తెలిపారు. ఈ చిత్రానికి కథ: వంశీపైడిపల్లి, వక్కంతం వంశీ, మాటలు: అబ్బురి రవి, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్.