Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
రామ్ చరణ్ రాజకీయం, యూత్కు అడ్వైజ్
హైదరాబాద్: చాలా మంది తెలుగు యాక్టర్స్ రాజకీయాలు గురించి మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు. రాజకీయాల ప్రస్తావన తెస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని కొందురు, రాజకీయాలంటే మురికి కుంట అని కొందరు రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు.
ఇటీవల తన తాజా సినిమా నాయక్ సక్సెస్ టూర్లో పాల్గొన్న రామ్ చరణ్ మాట్లాడుతూ... యువత రాజకీయాలకు రెస్పెక్ట్ ఇవ్వాలని, రాజకీయాలను గురించి తెలుసుకోవాలని అడ్వైజ్ ఇచ్చారు. యువత రాజకీయ జ్ఞానం కలిగి ఉండాలని, అప్పుడే దేశంలో మంచి పరిపాలన వ్యవస్థ ఏర్పాడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
ఓ మూవీ పోర్టల్ తో మాట్లాడుతూ రామ్ చరణ్ రాజకీయాలపై తన స్టాండ్ ఏమిటో వివరించారు. రాజకీయాలు, రాజకీయ నాయకులన్నా తనకు ఎంతో ఆసక్తి అని చెప్పుకొచ్చారు. యువత రాజకీయాలపై ఆసక్తి చూపాలని, దేశం, ప్రభుత్వం, మన పాలకులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
రామ్ చరణ్కు ఉన్నట్టుండి రాజకీయాలపై ఇంత ఇంట్రెస్ట్ ఎలా కలిగిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం...... పార్టీని నడిపించడం అంటే సినిమాలు చేసినంత వీజీ కాదని తెలుసుకోవడం, సామాజిక న్యాయం సాకుతో కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.