Don't Miss!
- News భారత్లో పెట్టుబడులపై ఎలాన్ మస్క్ యూటర్న్?
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
మెరుపు మాయమవ్వడంతో 'సింహా' డైరక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్
'మగధీర" లాంటి విజయాన్ని చవి చూసిన తర్వాత 'ఆరెంజ్"లాంటి ప్లాప్ ని చవిచూశాడు రామ్ చరణ్.'ఆరెంజ్' సినిమా ఫ్లాప్ తర్వాత ఏ సినిమా చేయాలన్న విషయంలో రామ్ చరణ్ తేజ మల్లగుల్లాలు పడుతున్న సంగతి తెలిసిందే. ముందు అనుకున్నట్టుగా 'మెరుపు సినిమా ఇప్పట్లో స్టార్ట్ అయ్యేలా లేదు. మాస్ సినిమా చేయాలన్న ఉద్దేశంతో చరణ్ రకరకాల కథలు వింటున్నాడు. ఈ నేపథ్యంలో 'సింహా' చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పిన కథ చరణ్ కు ఎంతగానో నచ్చిందనీ, దాంతో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ తెలుస్తోంది.
ఇది పక్కా మాస్ సినిమాగా రూపొందుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా ఎవరు నిర్మిస్తారూ అన్నది త్వరలో తెలుస్తుంది. బోయపాటా ఇప్పటివరకు దర్శకత్వం వహించిన భద్ర, తులసి, సింహా మూడు హిట్టఅయిన విషయం తెలిసిందే. ఈయన దర్శకత్వంలో చేస్తే హిట్ ఖాయం అని భావించి, కథ నచ్చి చరణ్ ఈ చిత్రం చేయాలనుకొంటున్నాడట. వీరి కాంబినేషన్ లో పక్కా మాస్ మసాలా చిత్రం రానుందని మెగాఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. బోయపాటి ప్రస్తుతం యన్టీఆర్ తో ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఈమధ్యే లాంచనంగా ప్రారంభమైంది.