Don't Miss!
- News కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆయన డైరెక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్..
ఇటీవల కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద దర్శకుల పేర్లు తర్వాత వినిపిస్తున్న పేరు వంశీ పైడిపల్లి. తన మొట్టమొదటి సినిమా మున్నా సినిమా ద్వారా వెండి తెరకు దర్శకుడిగా పరిచయమయ్యారు వంశీ పైడిపల్లి. తనదైన శైలిలో సినిమాలు తీస్తూ తనకంటూ ఓవైవిద్యమైన దర్శకుడంటూ ముందుకోచ్చాడు. ఇంతకీ వంశీ పైడిపల్లిని అందరూ మెచ్చుకోవడానికి కారణం మాస్ హీరో అయినటువంటి జూఎన్టీఆర్ చేత బృందావనం లాంటి క్లాస్ సినిమా తీసి అందరి చేత శభాష్ అని అనిపించుకున్నాడు. అసలు జూఎన్టీఆర్ నిఆక్యారెక్టర్ కోసం ఒప్పించడమే పెద్ద సాహాసం అని చెప్పాలి. అలాంటిది అంత పెద్ద హిట్ సినిమా తీసి జూఎన్టీఆర్ క్లాస్ సినిమాలు చేయలేరు అనే వాళ్శ నోరు మూయించాడు మన వంశీ పైడిపల్లి.
బృందావనం సినిమాతో దర్శకునిగా నిరూపించుకున్న వంశీ పైడిపల్లికి మరో అరుదైన అవకాశం లభించింది. రామ్ చరణ్ వంశీ దర్శకత్వంలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత కొంత కాలంగా రామ్ చరణ్ తేజ్ డేట్స్ గురుంచి ఎదురుచూస్తున్న దిల్ రాజు నిరీక్షణ ఫలించింది. దిల్ రాజు, చరణ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో జూలై నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. గతంలో కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఎదురు చూస్తూ సరైన కధ దొరక్క సినిమా చేయలేకపోయారు రాజు. అప్పుడు ఎన్టీఆర్ ని తన కధతో ఒప్పించి దిల్ రాజు బేనర్ లో సినిమా చేసాడు. ఇప్పుడు కూడా గత కొంత కాలంగా చరణ్ తో సినిమా చేయాలని అనుకుంటున్న రాజు కోరికను మరోసారి వంశీ పైడిపల్లి తీర్చబోతున్నాడు. ఏదైతేనేం మన యువ దర్శకుడు వంశీ పైడిపల్లి తీసేటటువంటి ఈసినిమాకుడా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుందాం.