Don't Miss!
- News కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్: ఏమన్నారంటే?
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇద్దరికీ గుండె ఆగినంత పనైంది: రామ్చరణ్
రామ్ చరణ్ మాట్లాడుతూ... నానక్రామ్గూడాలో మాయా గుహలు ఉన్నాయని ఎవరో చెబితే నేనూ రానా ఓరోజు రాత్రి ఇంట్లో చెప్పకుండా అక్కడికి వెళ్లాం. అక్కడున్న కొండ ఎక్కి చూస్తే... పుర్రెలూ నల్లని బొమ్మలూ దూరంగా మంటలూ కనిపించాయి. అంతే, ఇద్దరికీ గుండె ఆగినంత పనైంది.
చాలా భయమేసింది. వెనక్కి తిరిగి పరుగు అందుకున్నాం. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకూ పరుగు ఆపలేదు. ఆ సంఘటన తల్చుకుంటే చాలాచాలా నవ్వొస్తుంటుంది. ఇద్దరం కలిసినప్పుడు ఆ విషయం గుర్తు చేసుకుంటూంటాం' అని చెప్పాడు రామ్చరణ్.
ప్రస్తుతం రామ్చరణ్ 'ఎవడు' షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. శ్రుతిహాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే రెండు పాటల్ని స్విట్జర్లాండ్, బ్యాంకాక్లో చిత్రీకరించారు. షూటింగ్ కార్యక్రమాలు తుది దశకు చేరాయి. కోట శ్రీనివాసరావు, జయసుధ, సాయికుమార్, రాహుల్దేవ్, అజయ్, ఎల్.బి.శ్రీరాం, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రధారులు. సహ నిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, కూర్పు: మార్తాండ్.కె.వెంకటేష్, కళ: ఆనంద్ సాయి, సంగీతం: దేవిశ్రీప్రసాద్