చైనా షూటింగు ముగించుకుని వచ్చిన చరణ్..నిశ్చితార్థానికి షూటింగ్ బ్రేక్..!
'రచ్చ' అవుట్ డోర్ షెడ్యులు షూటింగు పూర్తి చేసుకుని హీరో రామ్ చరణ్ తేజా హైదరాబాదు తిరిగొచ్చాడు. సంపత్ నంది డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగు తాజాగా పది రోజుల పాటు చైనాలోని వివిధ లొకేషన్లలో జరిగింది. చరణ్, తమన్నాలపై ఓ పాటనూ, చరణ్, కొంత మంది ఫైటర్లపై ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ నూ అక్కడి బ్యాంబూ ఫారెస్ట్ లో చిత్రీకరించారు. అక్కడ విపరీతమైన హిమపాతం వల్ల షూటింగు చేయడం కాస్త కష్టమైనప్పటికీ, క్వాలిటీ పరంగా మాత్రం బాగా వచ్చిందని చరణ్ అన్నాడు. ఫైట్ సీక్వెన్స్ 'ఫెంటాస్టిక్' అని కితాబిచ్చాడు. అన్నట్టు, డిసెంబర్ ఒకటిన రామ్ చరణ్ వివాహ నిశ్చితార్ధం తన ప్రియసఖి ఉపాసనతో హైదరాబాదు శివారులోని గోల్కొండ రిసార్ట్స్ లో అంగరంగ వైభవంగా జరుగనున్న సంగతి తెలిసిందే!
మెగా ఫ్యామిలీ ఇంట పెళ్ళి హడావుడి మొదలయ్యింది. పెళ్ళి వేడుకలతో పాటు, నిశ్చితార్ధం కూడా ఘనంగా చేయాలని మెగా కుటుంబం ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఈ ఏర్పాట్లు ఘానంగా మొదలయ్యాయి. ముందుగా నిర్ణయించినట్టు నిజామాబాద్ దోమకొండ గడీలో కాకుండా హైదరాబాద్ శివార్లులోని ఓ రిసార్ట్ లో నిశ్చితార్ధం ఏర్పాట్లు జరగనున్నాయి. ఈ నిశ్చితార్ధం విఐపిలతో సందడిగా ఉండబోతుంది. నిశ్చితార్ధ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ రానున్నట్లు తెలుస్తుంది. చిరంజీవికి సంబంధించిన ప్రతి ముఖ్య కార్యక్రమానికి బిగ్ బి హాజరవుతారు. ఈ నిశ్చితార్దానికి కూడా ఆయన వస్తారని సమాచారం. బిగ్ బి తో పాటు రాష్ట్ర, కేంద్రంలోని పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరు కానున్నారు.


Click it and Unblock the Notifications











