Don't Miss!
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- News గజలక్ష్మీ యోగం.. సరిగ్గా ఐదు రోజుల్లో వీరికి డబ్బే డబ్బు
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
రామ్ చరణ్ తేజ్ ‘ఆరంజ్’లోనూ అదే రేంజ్ ఫైట్....!
'ఒక్కొక్కడినీ కాదు షేర్ ఖాన్..వందమందినీ ఒకేసారి రమ్మను" అంటూ 'మగధీరు"డిలా సవాల్ చేసి మరీ తన దమ్ము చూపించిన రామ్ చరణ్ తన తాజా చిత్రం 'ఆరంజ్" లోనూ ఆ రేంజ్ ఫైట్ ఒకటి చేస్తున్నాడు. అయితే 'మగధీర" లో ఆకాశానికీ..పాతాళానికీ మధ్య నిలబడి ఓ ఇరుకైన వంతెనపై ప్రత్యర్తులను చీల్చి చెండాడిన చెర్రీ ఈసారి సముద్రమపు లోతుల్లో సమరం సాగించనున్నాడని సమాచారం.
బేసిక్ గా 'ఆరంజ్" అనేది లవ్ స్టోరీ అయినప్పటికీ మెగా ఫ్యాన్స్ కోసం కథలో యాక్షన్ ఎపిసోడ్స్ కి స్థానం కల్సించిన దర్శకుడు భాస్కర్ ఆ పోరాట దృశ్యాల్నీ వినూత్న పంథాలో తెరపై చూపాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఆ ప్రయత్నంలో భాగంగానే 'ఆరంజ్" లో చెర్రీ పై ఓ స్కూబా ఫైట్ ని డిజైన్ చేశారట. రామ్ చరణ్ తో పాటు పలువురు విదేశీ ఫైటర్స్ పాల్గొనే ఈ స్కూబా ఫైట్ ని ఆస్ట్రేలియాలో పిక్చరైజ్ చేస్తున్నారనీ, ఆ ఎపిసోడ్ కి టెక్నీషియెన్స్ కూడా అక్కడివాళ్ళే వర్క్ చేస్తున్నారనీ తెలిసింది.