Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సీక్రెట్గా రామ్ చరణ్, ఉపాసన జంప్!
పెళ్లయిన తర్వాత వచ్చే ఆ మూడు మధురమైన ఏకాంతమైన రాత్రుల కోసం ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఈ నెల 14న మూడు ముళ్లతో ఏకమైనా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసన ఆ మూడు రాత్రులు ఎంజాయ్ చేయడానికి ఎవరికీ తెలియకుండా సోమవారం సీక్రెట్గా ఓ ఏకాంత ప్రదేశానికి జంప్ అయ్యారు.
ఈ విషయాన్ని రామ్ చరణ్ తన ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. మూడు రోజుల పాటు ఉపాసనతో కలిసి హాలిడే ఎంజ్ చేయడానికి వచ్చానని, ఇప్పటి వరకు బిజీబిజీగా గడిపిన తాను మరికొన్ని రోజుల్లో పాల్గొనబోయే షూటింగలకు రిలాక్స్ అయి రిఫ్రెష్డ్గా వెలుతానని ట్వీట్ చేశాడు. అయితే ఎక్కడికి వెళ్లిందనే విషయం మాత్రం చెర్రీ సీక్రెట్గా ఉంచాడు. బహుషా వచ్చిన తర్వాత ఆ విషయం వెల్లడిస్తాడేమో?
రామ్ చరణ్-ఉపాసన వివాహం ఈ నెల 14న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. మర్నాడు అభిమానుల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసి అభిమానులకు తాము ఎంత ప్రాధాన్యం ఇస్తామో చూపించారు మెగా ఫ్యామిలీ. తన జీవితంలోకి ఉపాసన రాకను అదృష్టంగా భావిస్తున్న చెర్రీ ఇకపై తన కెరీర్ మరింత మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నాడు.
ప్రస్తుతం చెర్రీ బాలీవుడ్ మూవీ 'జంజీర్', వంశీ పండిపల్లి దర్శకత్వంలో 'ఎవడు', వినాయక్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హనీమూన్ ముగిసిన అనంతరం రామ్ చరణ్ ఈ సినిమాల షూటింగులతో బిజీబిజీ కానున్నాడు.