Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సల్మాన్ ఖాన్ కోసం రాంచరణ్ రెండోసారి.. తెలుగులోకి క్రేజీ చిత్రం!
కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం భారత్. సుల్తాన్, టైగర్ జిందా హై తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. భారత్ పై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల్ రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన టీజర్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. ఒడే టూ మై ఫాదర్ అనే కొరియన్ చిత్రానికి ఇది రీమేక్. మరోసారి కత్రినా కైఫ్ ఈ చిత్రంలో సల్మాన్ తో జోడి కట్టింది. భారత్ చిత్రంలో సల్మాన్ ఖాన్ తెలుగు ఆడియన్స్ ని కూడా పలకరించబోతున్నాడు. ఈ చిత్రం తెలుగులో విడుదల కానున్న నేపథ్యంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
విభిన్న గెటప్పులలో
సల్మాన్ ఖాన్ భారత్ చిత్రంలో పలు గెటప్స్ లో కనిపించబోతున్నాడు. బ్రిటిష్ కాలంలో మొదలయ్యే ఈ చిత్రం సల్మాన్ ఖాన్ వృద్ధుడయ్యే వరకు కొనసాగుతుంది. యువకుడిగా, నేవి అధికారిగా, వృద్దుడిగా కనిపించబోతున్నాడు. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు.
రాంచరణ్ మరోసారి
భారత్ తెలుగు చిత్రంలో సల్మాన్ ఖాన్ పాత్రకు రాంచరణ్ డబ్బింగ్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా రాంచరణ్ సల్మాన్ చిత్రానికి వాయిస్ అందించాడు. సల్మాన్ ఖాన్, సోనం కపూర్ నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రానికి కూడా రాంచరణే డబ్బింగ్ చెప్పాడు. భారత్ చిత్ర డబ్బింగ్ కోసం రాంచరణ్ రెండు రోజుల సమయం కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్ రిక్వస్ట్
ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రంలో సల్మాన్ ఖాన్ కు రాంచరణ్ వాయిస్ బాగా సెట్ అయింది. దీనితో సల్మాన్ ఖాన్ స్వయంగా రాంచరణ్ ని రిక్వస్ట్ చేశాడట. భారత్ చిత్రానికి కూడా తనకు వాయిస్ అందించాలని కోరడంతో చరణ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. రంజాన్ సంధర్భంగా భారత్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
కీలక పాత్రల్లో
భారత్ చిత్రంలో టబు, దిశా పటాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారత్ చిత్రం తెలుగులో విడుదల కానుండడంతో ఇక్కడి సల్మాన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సల్మాన్ ని రాంచరణ్ వాయిస్ తో చూడనుండడం భారత్ పై మరింతగా ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రానికి సల్మాన్ ఖాన్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.