Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జంజీర్ : రామ్ చరణ్ ట్రైనింగ్ అయ్యాడిలా...
హైదరాబాద్ : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జంజీర్ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కేవలం సౌతిండియాకే పరిచయం అయిన రామ్ చరణ్ 'జంజీర్' చిత్రం ద్వారా నార్త్ ఇండియాసినీ పరిశ్రమలోనూ అడుగు పెట్టబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆలిండియా హీరో కాబోతున్నాడు.
మరి రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? ఆయన భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనేది జంజీర్ సినిమా ఇచ్చే ఫలితాల మీదనే ఆధార పడి ఉంటుందని చెప్పక తప్పదు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడం కోసం చాలానే కష్ట పడ్డాడు చరణ్. జంజీర్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చరణ్ తన ఫిజిక్ని అందుకు తగిన విధంగా మార్చుకునేందుకు ఆస్ట్రేలియన్ ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాడు.
'జంజీర్' చిత్రం సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో 'తుఫాన్' పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సినిమాలో ఓ యాక్షన్ సీన్ చిత్రీకరణ కోసం నిర్మాతలు దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ఈచిత్రం వేసవిలోనే విడుదల కావాల్సి ఉండగా ఈ చిత్ర నిర్మాతలు న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోవడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రానికి సంబంధించిన లీగల్ సమస్యలు ఓ కొలిక్కి రావడంతో సినిమాను సెప్టెంబర్ 06న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
'జంజీర్' ఎవరూ ఊహించని రేంజిలో రికార్డు స్థాయి రేటుకు అమ్ముడు పోయింది. ఈచిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ను రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ రూ. 105 కోట్లు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ సినిమాలకు తెలుగులో దాదాపు రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసే స్టామినా ఉండటం, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనే ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉండటంతో పాటు, హిందీ మార్కెట్లో 'జంజీర్' చిత్రం అవలీలగా 80 కోట్లపైగానే వసూలు చేసే అవకాశం ఉండటంతో వంద కోట్లకు పైగా భారీ మొత్తానికి వెచ్చింది జంజీర్ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో జంజీర్ చిత్రాన్ని 'తుఫాన్' పేరుతో, మళయాలంలో 'ముంబై కా హీరో' పేరుతో విడుదల చేస్తున్నారు.