Don't Miss!
- News అమిత్ షా ఓ గూండా, రౌడీ, అయినా పక్కనే పెట్టుకున్న ప్రధాని మోదీ, సీఎం కొడుకు సంచలనం!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేష్ ని ఉద్దేశించి రామ్ చరణ్ ట్వీట్
రామ్ చరణ్ తాజాగా ఇలా ట్వీట్ చేసారు...ఒకరు నిజంగా ఏదైనా సాధించినప్పుడు తన సక్సెస్ గురించి తన గొంతు విప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ప్రజలు ఆటోమేటిక్ గా దాని గురించే మాట్లాడుకుంటారు అన్నారు.అయితే దూకుడు రికార్డుల గురించి వివాదం జరుగుతున్న ఈ సమయంలో రామ్ చరణ్ నర్మగర్భంగా ఇలా ట్వీట్ చేయటంతో అందరూ దీన్ని డైరక్ట్ గా దూకుడు చిత్రం గురించే అని మహేష్ అప్పుడు ట్వీట్ చేసిన దానికి సమాధానమని భావిస్తున్నారు.మహేష్ తన దూకుడు చిత్రం గురించి ఆ మధ్య...ఇది అపీషయల్.. దూకుడు తెలుగు ఇండస్ట్రీలో హైయిస్ట్ గ్రాసర్. .అన్ బిలీవబుల్ అని ట్వీట్ చేసారు. ఈ విషయం అంతటా చర్చనీయాంశమైంది.మరో ప్రక్క మగధీర చిత్రంతో దూకుడు ని పోలుస్తూ మెగాభిమానలు రీసెంట్ గా విజయవాడలో లక్ష రూపాయలు ప్రైజ్ మనీ ప్రకటించారు.దూకుడువి ఫేక్ రికార్డులని వారు అబియోగం.అయితే దానికి మహేష్ అభిమానులు స్పందిస్తూ..దూకుడువి ఫేక్ రికార్డులని రుజువు చేస్తే కోటి ఇస్తామని కౌంటర్ ఇచ్చారు.ఈ నేపధ్యంలో రామ్ చరణ్ ట్వీట్ చేయటం అంతటా వేడిక్కించింది.రామ్ చరణ్ అభిమానుల్లో ఆనందాన్ని కలుగచేసింది.ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ..రచ్చ షూటింగ్ లో పాల్గొంటున్నారు.సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని సమాచారం.మరో ప్రక్క మహేష్ బాబు..ది బిజెనెస్ మ్యాన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.