Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘సైరా’ అగ్నిప్రమాదంపై రాంచరణ్ స్పందన... తృటిలో తప్పించుకొన్న అమితాబ్... నష్టం ఎన్ని కోట్లంటే!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సైరా నర్సింహారెడ్డి షూటింగ్లో అపశృతి చోటుచేసుకొన్నది. ఈ సినిమాకు సంబంధించిన సెట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం చిత్ర యూనిట్ను విషాదానికి గురిచేసింది. చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా కోసం గండిపేటకు సమీపంలోని కోకాపేటలోని మెగాస్టార్ ఫాంహౌస్లో భారీ సెట్ వేశారు. ఈ సెట్లో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలోని నివాసులు గమనించి అగ్నిమాపక దళానికి సమాచారం చేరవేయడంతో పెనుముప్పు తప్పింది. అగ్ని ప్రమాదం గురించి వివరాల్లోకి వెళితే...
మంటల్లో విలువైన సెట్టింగులు
శుక్రవారం తెల్లవారుజామున చిరంజీవి ఫాంహౌస్లోని సెట్ నుంచి పొగలు, మంటలు రావడంతో ఆ ప్రాంతవాసులంతా అలర్ట్ అయ్యారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుండగా అక్కడి ఫైర్ ఇంజన్లు చేరుకొన్నాయి. అప్పటికే విలువైన సెట్టింగులు మంటల్లో బూడిదగా మారాయి.
భారీగా ఆస్తి నష్టంతో
సైరా సెట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టంపై ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఆస్తి నష్టం రూ.2 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా వేశారు. పూర్తి విశ్లేషణ అనంతరం కచ్చితమైన నష్టాన్ని తేల్చే అవకాశం ఉంది. త్వరలోనే మళ్లీ సెట్ పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.
హీరో రాంచరణ్ స్పందన
సైరా సెట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై మెగా పవర్స్టార్ రాంచరణ్ స్పందించారు. కోకాపేటలో వేసిన సెట్లో తెల్లవారు జామున అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్ణకరం. భగవంతుడి దయ వల్ల ప్రాణహాని నష్టం జరగలేదు. చివరి షెడ్యూల్ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని రాంచరణ్ ట్వీట్ చేశారు. ఈ సినిమాను కొణిదెల బ్యానర్పై రాంచరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
అమితాబ్ బచ్చన్ షూటింగ్ వాయిదా
సైరా కోసం వేసిన కోట సెట్లో షూటింగ్ కొద్దిరోజులుగా జరుగుతున్నది. శుక్రవారం రోజున బిగ్బీ అమితాబ్ బచ్చన్పై కొన్ని సీన్లు చిత్రీకరించాల్సి ఉంది. అగ్ని ప్రమాదం కారణంగా ఆయన షూటింగ్ను వాయిదా వేసుకొన్నారు.
రూ. 300 కోట్ల బడ్జెట్తో
స్వాతంత్ర్య సమరయోధుడు, రాయలసీమ పోరాట యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సైరా నర్సింహారెడ్డి తెరకెక్కుతున్నది. సుమారు రూ.300 కోట్ల రూపాయలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, జగపతిబాబు, కిచ్చ సుదీప్, నయనతార, తమన్నా భాటియా తదితరులు నటిస్తున్నారు.