twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సైరా’ అగ్నిప్రమాదంపై రాంచరణ్ స్పందన... తృటిలో తప్పించుకొన్న అమితాబ్... నష్టం ఎన్ని కోట్లంటే!

    |

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సైరా నర్సింహారెడ్డి‌ షూటింగ్‌లో అపశృతి చోటుచేసుకొన్నది. ఈ సినిమాకు సంబంధించిన సెట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం చిత్ర యూనిట్‌ను విషాదానికి గురిచేసింది. చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా కోసం గండిపేటకు సమీపంలోని కోకాపేటలోని మెగాస్టార్ ఫాంహౌస్‌లో భారీ సెట్ వేశారు. ఈ సెట్‌లో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలోని నివాసులు గమనించి అగ్నిమాపక దళానికి సమాచారం చేరవేయడంతో పెనుముప్పు తప్పింది. అగ్ని ప్రమాదం గురించి వివరాల్లోకి వెళితే...

    మంటల్లో విలువైన సెట్టింగులు

    మంటల్లో విలువైన సెట్టింగులు

    శుక్రవారం తెల్లవారుజామున చిరంజీవి ఫాంహౌస్‌లోని సెట్ నుంచి పొగలు, మంటలు రావడంతో ఆ ప్రాంతవాసులంతా అలర్ట్ అయ్యారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుండగా అక్కడి ఫైర్ ఇంజన్లు చేరుకొన్నాయి. అప్పటికే విలువైన సెట్టింగులు మంటల్లో బూడిదగా మారాయి.

     భారీగా ఆస్తి నష్టంతో

    భారీగా ఆస్తి నష్టంతో

    సైరా సెట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టంపై ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఆస్తి నష్టం రూ.2 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా వేశారు. పూర్తి విశ్లేషణ అనంతరం కచ్చితమైన నష్టాన్ని తేల్చే అవకాశం ఉంది. త్వరలోనే మళ్లీ సెట్ పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    హీరో రాంచరణ్ స్పందన

    హీరో రాంచరణ్ స్పందన

    సైరా సెట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై మెగా పవర్‌స్టార్ రాంచరణ్ స్పందించారు. కోకాపేటలో వేసిన సెట్లో తెల్లవారు జామున అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్ణకరం. భగవంతుడి దయ వల్ల ప్రాణహాని నష్టం జరగలేదు. చివరి షెడ్యూల్‌ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని రాంచరణ్ ట్వీట్ చేశారు. ఈ సినిమాను కొణిదెల బ్యానర్‌పై రాంచరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

    అమితాబ్ బచ్చన్ షూటింగ్ వాయిదా

    అమితాబ్ బచ్చన్ షూటింగ్ వాయిదా

    సైరా కోసం వేసిన కోట సెట్‌లో షూటింగ్ కొద్దిరోజులుగా జరుగుతున్నది. శుక్రవారం రోజున బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌పై కొన్ని సీన్లు చిత్రీకరించాల్సి ఉంది. అగ్ని ప్రమాదం కారణంగా ఆయన షూటింగ్‌ను వాయిదా వేసుకొన్నారు.

    రూ. 300 కోట్ల బడ్జెట్‌తో

    రూ. 300 కోట్ల బడ్జెట్‌తో

    స్వాతంత్ర్య సమరయోధుడు, రాయలసీమ పోరాట యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సైరా నర్సింహారెడ్డి తెరకెక్కుతున్నది. సుమారు రూ.300 కోట్ల రూపాయలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, జగపతిబాబు, కిచ్చ సుదీప్, నయనతార, తమన్నా భాటియా తదితరులు నటిస్తున్నారు.

    English summary
    Megastar Chiranjeevi’s 151st film ‘Sye Raa Narasimha Reddy Helmed on a massive budget of Rs 300 crore, This movie Shooting currently undergoing its final stages of shoot at a specially erected set in Kokapet in huge kingdom set which is Owned by Chiranjeevi. On Friday wee hours a massive fire broke out this morning burning out a significant part of the film’s set to ashes which is worth more than Rs 2 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X