twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉపాసన ఎదుట మగధీర విన్యాసాలు-పస్ట్ పబ్లిక్ ఎంట్రీ

    By Bojja Kumar
    |

    పెళ్లి ద్వారా త్వరలో ఏకం కాబోతున్న రామ్ చరణ్, ఉపాసన తొలిసారిగా ఇద్దరు కలిసి పబ్లిక్ ముందుకు వచ్చారు. సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్స్ లో జరుగుతున్న పోలో పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఈ జంట ఇక్కడికి వచ్చి సందడి చేశారు. ఆడియన్స్ గ్యాలరీలో ఇద్దరు పక్కపక్కనే కూర్చొని ఆటను ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చరణ్ గుర్రపు స్వారీ చేసి అందరినీ ఉత్సాహ పరిచాడు. చరణ్ విన్యాసాలను స్వయంగా చూసిన ఉపాసన ఉబ్బి తబ్బిబ్బయిపోయింది. వీరితో పాటు ఉపాసన మదర్ కూడా ఈ పోటీలను తిలకించేందుకు వచ్చారు.

    తొలి సారిగా ఈ జంట పబ్లిక్ లోకి రావడంతో వారిని తమ కెమెరాల్లో బంధించడానికి మీడియా ప్రతినిధులు పోటీ పడ్డారు. రామ్ చరణ్ ఇటీవల పోలో టీంను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ పోటీల్లో రామ్ చరణ్ టీం కూడా పాల్గొంటోంది. ఉపాసన కోరిక మేరకే రామ్‌చరణ్ పోలో టీమ్‌ను కొన్నారని అంటారు. పోటీలు జరుగుతున్నప్పుడు రామ్ చరణ్, ఉపాసన కూర్చుని చూశారు.

    English summary
    Ram charan and upasana were present at polo grounds in Secendurabad today. Ram Charan made horse riding before his fiancee.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X