Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఉపాసన ఎదుట మగధీర విన్యాసాలు-పస్ట్ పబ్లిక్ ఎంట్రీ
పెళ్లి ద్వారా త్వరలో ఏకం కాబోతున్న రామ్ చరణ్, ఉపాసన తొలిసారిగా ఇద్దరు కలిసి పబ్లిక్ ముందుకు వచ్చారు. సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్స్ లో జరుగుతున్న పోలో పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఈ జంట ఇక్కడికి వచ్చి సందడి చేశారు. ఆడియన్స్ గ్యాలరీలో ఇద్దరు పక్కపక్కనే కూర్చొని ఆటను ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చరణ్ గుర్రపు స్వారీ చేసి అందరినీ ఉత్సాహ పరిచాడు. చరణ్ విన్యాసాలను స్వయంగా చూసిన ఉపాసన ఉబ్బి తబ్బిబ్బయిపోయింది. వీరితో పాటు ఉపాసన మదర్ కూడా ఈ పోటీలను తిలకించేందుకు వచ్చారు.
తొలి సారిగా ఈ జంట పబ్లిక్ లోకి రావడంతో వారిని తమ కెమెరాల్లో బంధించడానికి మీడియా ప్రతినిధులు పోటీ పడ్డారు. రామ్ చరణ్ ఇటీవల పోలో టీంను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ పోటీల్లో రామ్ చరణ్ టీం కూడా పాల్గొంటోంది. ఉపాసన కోరిక మేరకే రామ్చరణ్ పోలో టీమ్ను కొన్నారని అంటారు. పోటీలు జరుగుతున్నప్పుడు రామ్ చరణ్, ఉపాసన కూర్చుని చూశారు.