Don't Miss!
- Sports CSK vs LSG: కొంపముంచిన ముస్తాఫిజుర్.. లక్నోను గెలిపించిన స్టోయినిస్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రామ్ చరణ్ - ఉపాసనల నిశ్చితార్థం కోటలో కాదు ఫాం హౌస్...?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న ఇద్దరి నిశ్చితార్థం జరుపాలని పెద్దలు నిర్ణయించారు. నిశ్చితార్థ వేడుక ఉపాసన పూర్వీకులు నిర్మించిన దోమకొండ కోటలో జరుగుతుందని అంతా భావించారు. కానీ ఈ వేడుక అక్కడ జరుగడం లేదని తెలుస్తోంది.
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ వివాహ నిశ్చితార్ధం వేదిక మారుతోంది. మొదట్లో నిజామాబాద్ సమీపంలోని దోమకొండ కోటలో ఈ వేడుక జరుగుతుందని వార్తలొచ్చాయి. అందుకు తగ్గట్టుగా పాడుపడిన ఆ కోటకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు కూడా మొదలెట్టారు. అయితే, ఈ ఫంక్షన్ కు దేశవిదేశాల నుంచి వీఐపీలు విచ్చేస్తున్న సందర్భంగా, ఆ ప్రదేశం హైదరాబాదు నగరానికి దూరమవుతుందన్న ఉద్దేశంతోనూ, భద్రతా కారణాల దృష్ట్యాను, తాజాగా వెన్యూను మార్చినట్టు సమాచారం అందుతోంది.
ఈ నేపథ్యంలో హైదరాబాదు శివారులోని మొయినాబాదు దగ్గరలోని ఓ ఫాం హౌస్ ను ఎంపిక చేశారు. ఇప్పుడిక్కడ ఆ వేడుకకు తగ్గా ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఈ వేదిక శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు కూడా దగ్గరగా వుండడం కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. రామ్ చరణ్, ఉపాసనల నిశ్చితార్ధం డిసెంబర్ 1 న జరుగుతున్న సంగతి తెలిసిందే!