Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
జూ ఎన్టీఆర్ డైరెక్టర్ తో రామ్ చరణ్ కొత్త సినిమా నవంబర్లో..!?
ఇటీవల కాలంలో తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దర్శకల పేర్లు తర్వాత వినిపిస్తున్న పేరు వంశీ పైడిపల్లి. తన మొట్ట మొదటి సినిమా మున్నా సినిమా ద్వారా వెండి తెరకు దర్శకుడిగా పరిచయమయ్యారు వంశీ పైడిపల్లి. తనదైన శైలిలో సినిమాలు తీస్తూ తను ఓ వైవిద్యమైన దర్శకుడునంటూ ముందుకొచ్చాడు. ఇంతకీ వంశీ పైడిపల్లిని మొచ్చుకోవడానికి కారణం మాస్ హీరో అయినటువంటి జూ ఎన్టీఆర్ చేత బృందావనం లాంటి క్లాస్ సినిమా తీసి అందరి చేత శభాస్ అని పించుకున్నాడు.
గత సంవత్సరం జూ ఎన్టీఆర్ తో 'బృందావనం" వంటి హిట్ సినిమా చేసిన వంశీ పైడిపల్లి నెక్ట్స్ మూవీ రామ్ చరణ్ తో చేయబోతున్నాడు. ప్రస్తుతం 'రచ్చ" షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత వంశీ సినిమా చెయ్యబోతున్నాడని సమాచారం. దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం నవంబర్ లో ప్రారంభం కాబోతోంది. వంశీ చెప్పిన స్టోరీ లైన్ విన్న రామ్ చరణ్ ఎంతో ఇంప్రెస్ అయ్యాడట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. అక్టోబర్ లో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి.
రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం చేస్తున్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.