Don't Miss!
- News రామేశ్వరం కేఫ్ కేసులో ట్విస్ట్, క్లాస్ మేట్ కోసం ఏం చేశాడంటే?, బాంబర్ తో అన్ని నెలలు!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
రామ్ చరణ్ ‘ఎవడు’ మూవీ ఓపెనింగ్ విశేషాలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వంశీ పైడి పల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు 'ఎవడు' అనే టైటిల్ ఖరారు చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభ పూజా కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి... చరణ్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి ఇంకా అల్లు అర్జున్, అల్లు అరవింద్, దిల్ రాజు, వంశీ పైడి పల్లి హాజరయ్యారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్ రచయితగా, చోటాకె నాయుడు కోరియోగ్రఫీ చేస్తున్నారు. 'ఎవడు' చెర్రీ కెరీర్ లో మంచి హిట్ సినిమాగా నిలవాలని, సంచలన విజయం సాధించాలని ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులంతా ఆకాంక్షించారు. అదే విధంగా 'ఎవడు' సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆవిష్కరించారు. వచ్చే ఏడాది ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ సరసన నటించేందుకు హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి విశేషాలు వెల్లడిస్తామని 'ఎవడు' యూనిట్ సభ్యులు తెలిపారు.