twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ ‘ఎవడు’ మూవీ ఓపెనింగ్ విశేషాలు

    By Bojja Kumar
    |

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వంశీ పైడి పల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు 'ఎవడు' అనే టైటిల్ ఖరారు చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభ పూజా కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి... చరణ్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి ఇంకా అల్లు అర్జున్, అల్లు అరవింద్, దిల్ రాజు, వంశీ పైడి పల్లి హాజరయ్యారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్ రచయితగా, చోటాకె నాయుడు కోరియోగ్రఫీ చేస్తున్నారు. 'ఎవడు' చెర్రీ కెరీర్ లో మంచి హిట్ సినిమాగా నిలవాలని, సంచలన విజయం సాధించాలని ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులంతా ఆకాంక్షించారు. అదే విధంగా 'ఎవడు' సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆవిష్కరించారు. వచ్చే ఏడాది ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

    ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ సరసన నటించేందుకు హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి విశేషాలు వెల్లడిస్తామని 'ఎవడు' యూనిట్ సభ్యులు తెలిపారు.

    English summary
    Mega Power Star Ram Charan’s new film under the direction of Vamsi Paidipally titled Yevadu has completed its pooja ceremony today. The event was held at Prasad Labs at 7am in the morning.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X