Don't Miss!
- Sports ఐపీఎల్ లైవ్ ఫ్రీ.. ఒక్క RCB ఫ్యాన్స్కు తప్ప!
- Technology ఆపిల్ నుంచి త్వరలో ఏయే ఉత్పత్తులు లాంచ్ కానున్నాయో తెలుసా.. ఫోల్డబుల్ ఐఫోన్లు, ఐప్యాడ్లు సహా..!!
- Lifestyle ఈ మూడింటిలో మీ వేలు ఆకారం ఎలా ఉందో చెప్పండి... మీరు ఎలాంటి వారో మేం చెబుతాం
- News ఎన్నికల వేళ సీఎం జగన్కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
- Finance Gold Rate: షాకింగ్.. షాకింగ్.. షాకింగ్.. ఏకంగా రూ.4,600 పెరిగిన గోల్డ్.. ఒక్కరోజులోనే..
- Automobiles కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ఎన్టీఆర్ ఇంట్లో ఇద్దరం ‘నాయక్’ సినిమా చూసాం
హైదరాబాద్ : ఎన్టీఆర్, తనూ 'బావా, బావా' అని పిలుచుకుంటుంటారనే వార్తను రామ్ చరణ్ ఖండించారు. ఎన్టీఆర్ తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ...అలా ఏం లేదే! మేమిద్దరం చాలా క్లోజ్గా ఉంటాం. లాస్ట్ ఇయర్ దీపావళికి తను మా ఇంట్లోనే ఉన్నాడు. ఆ మధ్య వాళ్లింట్లో హోమ్ థియేటర్లో కూర్చుని ఇద్దరం 'నాయక్' సినిమా చూశాం. తన 'బాద్షా' ఓపెనింగ్కి కూడా వెళ్ళాను అన్నారు.
ఈ అనుబంధం తెలియని అభిమానులు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటుంటారనే వార్తపై స్పందిస్తూ..రామ్ చరణ్.... నేను అదే వద్దని చెబుతున్నా. మేమిక్కడ బాగానే ఉంటాం. వాళ్లూ అలానే ఉండాలి. ఈ క్యాంప్లు, గ్రూపులు ఎందుకు? అన్నారు. ఇండస్ట్రీలో తన బెస్ట్ఫ్రెండ్స్ గురించి చెప్తూ.. రానా, శర్వానంద్... వీళ్ళిద్దరూ నేను ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే ఫ్రెండ్స్. రానా, నేను స్కూల్లో బెంచ్మేట్స్మి కూడా అన్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ 'జంజీర్' వంటి ప్రతిష్టాత్మక చిత్రంతో ఆయన బాలీవుడ్ లో తెరంగేట్రం చే స్తున్నారు. ఈ చిత్రం 'తుఫాన్'గా తెలుగు ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఇదిలా వుండగా రామ్చరణ్ నటిస్తోన్న 'ఎవడు' చిత్రం హైదరాబాద్లో కీలక ఘట్టాల చిత్రీకరణ జరుపుకుంటోంది. శ్రీ వెంక క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకుడు. శృతిహాసన్, అమి జాక్సన్ హీరోయిన్స్ .
'ఎవడు'చిత్రం తొంభైశాతం చిత్రీకరణ పూర్తయింది. రెండు పాటలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ బ్యాలెన్స్గా వున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించిన పాటల్ని మే 9న విడుదల చేయబోతున్నారు. జూన్ 14న సినిమాను విడుదల చేస్తారు. ప్రత్యేక పాత్రల్లో అల్లుఅర్జున్, కాజల్అగర్వాల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్చరణ్ అభిమానుల్ని అలరించే అంశాలన్నీ వున్నాయి . యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని దర్శకుడు వంశీపైడిపల్లి తెలిపారు. ఈ చిత్రానికి కథ: వంశీపైడిపల్లి, వక్కంతం వంశీ, మాటలు: అబ్బురి రవి, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్.