Don't Miss!
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Sports ఆ నిర్ణయమే మమ్మల్ని గెలిపించింది- పంత్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రతీ మనిషి లోపల ఇంకొకడు ఉంటాడు.. పెళ్లైన తరువాతే.. ఆర్జీవీ రచ్చ
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలా ఉంటారో.. ఎలాంటి కామెంట్స్ చేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. ప్రత్యేక సందర్భాల్లో వర్మ చేసే కామెంట్స్ మరింత ప్రత్యేకంగా ఉంటాయి. అందరూ ఓ దారిన వెళ్తుంటే వర్మ మాత్రం తన కంటూ ఓ రహదారిని వేసుకుంటాడు. మహిళ దినోత్సవం నాడు వర్మ వేసిన ట్వీట్ చూస్తేనే ఆ విషయం తెలిసిపోతోంది. మహిళకు విషెస్ చెప్పనంటూనే ఆయన వేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంది.
వరుస ట్వీట్లు..
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ట్వీట్లు వేస్తూనే ఉంటాడు.అంతర్జాతీయ వ్యవహారాల నుంచి లోకల్గా జరిగే వాటిపైనా కౌంటర్లు, సెటైర్లు వేస్తుంటారు.అందులో కొన్ని రాజకీయ సెటైర్లు కూడా ఉంటాయి. ఇంకొన్ని అందరికీ తెలిసినట్టే అనిపించినా..అర్థం కాని విధంగా ట్వీట్లు వేస్తుంటాడు.
ఉమెన్స్ డే స్పెషల్..
మహిళలు ప్రతీ రోజూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే ఉమెన్స్ డే నాడు విష్ చేయడం లేదంటూ ఎంతో అర్థం వచ్చేలా ఓ ట్వీట్ వేశాడు. ఇక ఆర్జీవీ ట్వీట్ల సంగతులు అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు.
వాటిపై ఫోకస్..
ప్రస్తుతం ఆర్జీవీ తన డీ కంపెనీ, లడ్కీ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. ఓ వైపు పూజా భలేకర్ అందాలు మరో వైపు అప్సరా రాణి వయ్యారాల గురించి చెబుతూ ట్వీట్లు వేస్తున్నాడు. మహిళ దినోత్సవం సందర్భంగా వదలిన పాటల గురించి ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.
తాజాగా అలా..
అయితే తన మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నా కూడా తాజాగా ఓ ట్వీట్ వేశాడు. నీకు తెలిసిన ప్రతీ మనిషిలో.. తెలియని వాడు ఇంకొకడు ఉంటాడు.. ఆ లోపల ఉన్నావాడు.. పెళ్లైతే బయటకు వస్తాడు అంటూ ఆర్జీవీ తన ఫిలాసఫీని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఏ విషయాన్ని ఉద్దేశించి ఆ ట్వీట్ వేసి ఉంటాడా? అని అందరూ తలలు పట్టుకుంటున్నారు.
సోషల్ మీడియాపైనా..
ఇక ఇదే కాకుండా సోషల్ మీడియా గురించి చెబుతూ వర్మ వేసిన ట్వీట్ మరింతగా వైరల్ అవుతోంది. 99 శాతం మంది గొంతుకగా మారింది.. కానీ ఆ 99 శాతం మంది దద్దమ్మలు అని తెలిసేలా చేసిందంటూ కౌంటర్ వేశాడు. ఆ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.