భయపెడుతున్న వర్మ ‘భూత్ రిటర్న్స్’ ఫస్ట్లుక్
ముంబై: ఈ మద్య వరస గొడవలతో వివాదాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మకు ఎప్పుడు ఒకలాగే ఉండటం అసలు నచ్చదు. ప్రచారం కోసం అనవసరపు వివాదాలు సృష్టించి ఆ తరవాత అప్పలరాజు, దొంగల ముఠా వంటి సినిమాలు తీసి జనాలను ఫూల్స్ ను చేసిన వర్మ ఇప్పుడు కొద్దిగా మార్పు కోసం సినీ జనాలను భయపెట్టే ప్రయత్నాల్లో పడ్డాడు. గతంలో తాను రూపొందించిన 'భూత్'కు సీక్వెల్గా 'భూత్ రిటర్న్స్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు.
తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టరే ఇలా భయపెడుతుంటే సినిమా ఎలా ఉంటుందో? అక్టోబర్ 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది. 3డి ఫార్మాట్లో దీన్ని రూపొందించారు. అలుంబ్రా ఎంటర్ టైన్మెంట్స్ బేనర్పై ఈ చిత్రాన్ని నిర్మించగా...ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వారు ఈ చిత్రాన్ని విడుదచేస్తున్నారు. రామ్ గోపాల్ కెరీర్లోనే ఇది ఫస్ట్ 3డి సినిమా.
నిన్నటి తరం కథానాయిక మనీషా కోయిరాలా ఇందులో తల్లి పాత్ర పోషించగా, ఆరేళ్ళ అలయ్న అనే పాప కీలక పాత్ర పోషించింది. ఈ కథ వీరిద్దరి చుట్టూ తిరుగుతుంది కాబట్టి, వీరిద్దరే ఈ సినిమాలో ఎక్కువగా కనిపిస్తారు. జేడీ చక్రవర్తి మరో పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'భూత్ రిటర్న్స్ హర్రర్ మూవీ. బూత్ సినిమా మిమ్మల్ని భయపెడితే.., భూత్ రిటర్న్స్ మిమ్మల్ని చంపేస్తుంది' అని అంటున్నాడు వర్మ. వివాదాలతో చేసిన ప్రయోగాలూ కాసులు రాల్చవనే ఉద్దేశానికి వచ్చి తిరిగి తన పాత ఫార్ములానే నెత్తి కెత్తు కుంటున్న వర్మ ఈ సినిమాతో ఎంత వరకు సఫలీకృతం అవుతాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications












