Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఏపీ ముఖ్యమంత్రితో చిరంజీవి భేటీ.. రామ్ గోపాల్ వర్మ రియాక్షన్! రియల్లీ బ్యూటిఫుల్
Recommended Video
మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. సతీసమేతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన చిరు.. ఆయన్ను శాలువాతో సన్మానించి కాసేపు ముచ్చటించారు. ఈ మేరకు తన చారిత్రక సినిమా సైరా నరసింహా రెడ్డి చూడాలని ఆయన్ను కోరారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
చర్చనీయాంశంగా మారిన ఇష్యూ.. ఎంటరైన వర్మ
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి- చిరంజీవి భేటీ అంశం తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా సినీ, రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, సైరా నరసింహా రెడ్డి సినిమా విశేషాలు వీరి భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చాయని తెలిసింది. అయితే ఈ ఇష్యూపై రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్ కామెంట్ విసిరారు.
సరిగ్గా ఎన్నికల సమయంలో వర్మ స్టెప్
ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రామ్ గోపాల్ వర్మ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఎన్నికలు సమీపించిన తరుణంలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు వర్మ. అయితే ఆ సమయంలో టీడీపీ వర్గాలు అడ్డుపడటం లాంటి చర్యలు జరగడం.. దానిపై వర్మ రియాక్ట్ కావడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
రిసల్ట్ తర్వాత..
ఎన్నికల
రిసల్ట్
వచ్చి
వైఎస్
జగన్
మోహన్
రెడ్డి
ముఖ్యమంత్రి
అయ్యాక
లక్ష్మీస్
ఎన్టీఆర్
సినిమాను
ఏపీలో
విడుదల
చేయడం
జరిగింది.
ఈ
నేపథ్యంలో
క్రమంగా
మాజీ
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడుపై
వర్మ
విరుచుకు
పడటం
చూసాం.
ఈ
క్రమంలో
మళ్ళీ
ఇప్పుడు
వైఎస్
జగన్
మోహన్
రెడ్డి-
చిరంజీవి
భేటీ
విషయమై
వర్మ
కామెంట్
చేయడం
చర్చలకు
దారి
తీసింది.
|
ఇంతకీ వర్మ ఏమన్నాడంటే..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి- చిరంజీవి కలయిక చూసిన రామ్ గోపాల్ వర్మ.. వావ్ అంటూ సింగల్ లైన్ కామెంట్ విసరడం విశేషం. 151 తో 151 అని సింపుల్ గా కట్ చేస్తూ చిరంజీవికి జగన్ బహుకరించిన వీణ పిక్ షేర్ చేశారు వర్మ. ఆయన చేసిన ఈ కామెంట్లో 151 సినిమాలు పూర్తి చేసిన చిరంజీవి, 151 స్థానాల్లో విజయకేతనం ఎగరేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారని అర్థం దాగి ఉంది. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.
డిఫెరెంట్ సినిమాలతో..
ఈ మధ్య కాలంలో డిఫెరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు వర్మ. ఈ క్రమంలోనే `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` అంటూ మరో డిఫెరెంట్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ఏ మాత్రం కాంట్రవర్సీ లేదు అని చెబుతూనే సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రాజకీయ వర్గాలకు చుక్కలు చూపిస్తున్నాడు వర్మ.
బ్యూటిఫుల్ అంటూ మరో రచ్చ
ఇక బ్యూటిఫుల్ సినిమా రూపంలో మరో రచ్చకు తెరలేపారు వర్మ. రంగీలా సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందిస్తునట్లుగా ఆయన పేర్కొన్నారు. బ్యూటిఫుల్ చిత్రాన్ని నేటితరం యువత కోరుకునే విధంగా బ్యూటిఫుల్ గా రూపొందిస్తున్నారని ఇటీవలే విడుదల చేసిన అప్డేట్స్ చెప్పేశాయి.