Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగబాబును చూస్తే ఈర్ష.. నన్ను మించిపోయాడు.. వర్మ ప్రశంసల వెనుక అసలు కారణం అదేనా?
మెగా హీరోలతో దర్శకుడు రాంగోపాల్ వర్మ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విధంగా విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి వివాదంలో మెగా హీరోలపై కామెంట్లు చేయించారనే విషయంపై వర్మ మెగా ఫ్యాన్స్కు, హీరోలకు శత్రువుగా మారారు. అయితే శత్రువుకు, శత్రువు మిత్రుడు అన్నట్టు ఇప్పడు నాగబాబు రాంగోపాల్ వర్మ అండగా నిలిచారు. నందమూరి బాలకృష్ణకు ధీటుగా కౌంటర్లు ఇస్తున్న నాగబాబు తీరుకు వర్మ ఇప్పుడు ఫిదా అయిపోయి ప్రశంసలు కురిపిస్తున్నారు. వర్మ ఏమన్నారంటే..
వర్మ, నాగబాబు మధ్య వివాదం
టాలీవుడ్లో శ్రీరెడ్డి వివాదం తర్వాత రాంగోపాల్ వర్మ అంటేనే మెగా క్యాంపుకు చిర్రెత్తుకొచ్చేది. ఓ ఇంటర్యూలో వర్మ పేరు ఎత్తగానే నాగబాబు అబ్బే అతడి పేరు ఎత్తకండి అనే రేంజ్లో విసుగుపడ్డారు. తాజాగా వరుస వీడియోలతో బాలకృష్ణను ఏకి పారేస్తున్న నాగబాబును వర్మ ట్వీట్ చేసి ప్రశంసించారు.
|
ఒకవైపు నాకు ఈర్ష్య, బాధ
సాధారణంగా నన్ను మించిపోయారనే ఈర్ష్య, బాధ ఒకవైపు, తన స్టార్ బ్రదర్స్ను డిఫెండ్ చేయడంలో సూపర్స్టార్ అయ్యాడనే ఆనందం ఒకవైపు.. ఒక కంట కన్నీరు... మరో వైపు పన్నీరు. నాగబాబు హ్యాట్సాఫ్. నీ సోదరులను నీవెంతగా ఇష్టపడుతావో.. నేను కూడా అంతే ఇష్టపడుతాను అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
నందమూరి క్యాంప్పై వర్మ
ఇక ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రోమోలు, పాటలు, టీజర్లతో నందమూరి క్యాంపుకు వర్మ భారీ ఝలక్ ఇస్తున్నాడు. వరుసగా సంచలన విషయాలను వీడియోల్లో పేర్కొంటూ సెన్సేషనల్గా మారారు. తాజాగా విడుదల చేసిన ఎందుకు సాంగ్ ఇంటర్నెట్ మీడియాలో వైరల్గా మారింది.
అసహనానికి అదే కారణమా
గత కొద్దికాలంగా నందమూరి క్యాంపును టార్గెట్ చేసుకొని వర్మ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నారనే వార్తలు అప్పట్లో మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఆ తర్వాత తేజ పేరు.. అనంతరం క్రిష్ రంగంలోకి దూకడంతో వర్మ ఉత్సాహం నీరుకారింది. అప్పటి నుంచి నందమూరి క్యాంప్ను వర్మ టార్గెట్ చేసుకొన్నట్టు కనిపిస్తున్నది.