Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
పీఆర్పీ శోభారాణికి రామ్ గోపాల్ వర్మ కౌంటర్
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం "రక్త చరిత్ర" విడుదల సందర్భంగా టీవీ ఛానెల్స్ వారు చర్చవేదిక పెట్టారు. అందులో భాగంగా ఓ పాపులర్ టీవీ ఛానెల్ వారు పీఆర్పీ శోభారాణిని చర్చకు ఆహ్వానించారు. ఆమె తన తరహాలో మాట్లాడుతూ..రామ్ గోపాల్ వర్మ ఆంద్రా ప్రజల మనోభావాలు డామేజ్ చేసే విధంగా స్టుపిడ్ చిత్రాలు తీస్తున్నారని, అందులో రక్త చరిత్ర ఒకటని అన్నారు. అలా తాను అనటానికి కారణం..ఇలాంటి సినిమాలు పిల్లల మనస్సులపై తీవ్రమైన ప్రభావం చూపి వారిని రౌడీ షీటర్లుగా మారుస్తాయంటూ సుదీర్ఘంగా చెప్పుకొచ్చారు. ఆమె లెక్చర్ పూర్తయిన తర్వాత వర్మను లైన్ లోకి తీసుకున్నారు. ఆయన ఆవలిస్తూ..ఆవిడ మాట్లాడుతుంటే నిద్రవచ్చిందని, ఎట్లా ఆమెను భర్త బేర్ చేస్తున్నారని వ్యగ్యంగా అన్నారు. వెంటనే శోభారాణి..రామ్ గోపాల్ వర్మని దుమ్మెత్తిపోస్తూ..ఆయన తెలుగు మహిళలను అవమానపరుస్తున్నారని, ఇది తెలుగు జాతి గర్హించాల్సిన విషయమని, ఆయన క్షమాపణ చెప్పి తీరాల్సిందే అన్నారు. దానికి రామ్ గోపాల్ వర్మ స్పందించలేదు.