వర్మ హీరోయిన్ కి దెబ్బలు..

ఇక డాక్టర్ ప్రియాంకా కొఠారి కు ప్రాధమిక చికిత్స చేసి ప్లాస్టర్ వేసి ఓ వారం రోజులపాటు రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చాడని చెప్తున్నారు. అందుకని షూటింగ్ లో ఆమె లేని సన్నివేశాలు ప్లాన్ చేయాలని డైరక్షన్ టీమ్ తలములకలైందని సమాచారం. ప్రస్తుతం ఈ టీమ్ మొత్తం కేరళలోని అంత్రిపల్లి ఫారెస్టులో ఉన్నారు. గతంలో వర్మ ఇక్కడ నిశ్శబ్ద్ షూటింగ్ జరిపారు. అంతేగాక మణిరత్నం రావణ్ షూటింగ్ కి కూడా ఈ లొకేషన్ నే ఎంచుకున్నారు. ఇక సినిమాకు సంభందించిన మేజర్ షూటింగ్ అంతా శ్రీలంక లోని సిరిగియా అడవిలో జరిగిందని చెప్తున్నారు. అత్రిపల్లి అడవి..కేరళలోని కొచ్చికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది.
నితిన్, ప్రియాంకా కొఠారి ఈ చిత్రంలో ప్రదాన పాత్ర పోషిస్తున్నారు. ఇంతకుముందు ఆమె నిషా కొఠారి అనే పేరుతో పాపులర్ అయ్యింది.తాజాగా అది కలిసిరావటంలేదని మార్చుకుంది.అలాగే ప్రియాంక కొఠారి..జేమ్స్, వర్మకాషోలే, ఒక్క మగాడు చిత్రాల్లో నటించింది. ఇక స్టోరీ విషయానికి వస్తే అజ్ఞాతంగా ఉంటూ మనుషుల్ని చంపే ఓ శక్తి చుట్టూ అల్లుకొన్న కథ ఇది....ఓ సినిమా యూనిట్...షూటింగ్ కి వెళ్ళి ఓ దట్టమైన అరణ్యంలో చిక్కుకుపోతారు. అక్కడ ఒకరి తర్వాత మరొకరి హత్యలు జరుగుతూంటాయి. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారో తెలియదు. అలా చంపుతున్నది జంతువా? మనిషా? ఏదైనా ప్రేతాత్మ? అన్నది సస్పెన్స్.


Click it and Unblock the Notifications











