సూపర్ స్టార్స్ ని సూటిగా ప్రశ్నించిన వర్మ
హైదరాబాద్ :ఎప్పటికప్పుడు తాజా రాజకీయ, సామాజిక అంశాల మీద స్పందిస్తున్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ట్వీట్లతో ప్రశ్నించి అందరినీ ఆలోచనలో పడేసారు.
అవార్డులు తిరిగి ఇచ్చేస్తున్న రచయితలు, మేధావులు, సామాజిక వేత్తలను తన ట్వీట్ లతో ప్రశ్నించాడు. దేశంలో అసహనం ఎక్కడుందో నాకు అర్థం కావటం లేదంటూ తనదైన శైలిలో అడిగారు.

'హిందూ దేశంగా పేరున్న భారత్ లో షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి ముగ్గురు ముస్లిం నటులు సూపర్ స్టార్ లుగా వెలుగొందుతున్నారు. మరి అసహనం ఎక్కడుందో నాకు అర్ధం కావటం లేదు..?
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఒక హిందూ దేశంలో ముగ్గురు ముస్లిం నటులు సూపర్ స్టార్ లు అయ్యారంటేనే మెజారిటీ ప్రజలు అసహనంతో లేరని ప్రూవ్ అవుతోంది. సెలబ్రిటీలుగా పరిగణించబడుతున్న, ఎవరైతే అసహనం గురించి మాట్లాడుతున్నారో.. వారు విమర్శిస్తున్న దేశంలోనే సెలబ్రిటీలుగా ఉన్నారు. కొన్ని ఘటనల మూలంగా అసహనం ఉన్నట్టుగా ప్రకటించకూడదు' అంటూ ట్వీట్ చేశాడు వర్మ


Click it and Unblock the Notifications











