Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తప్పు చేయనప్పుడు తలవంచాలా? ఎవరి అనుమతి అవసరం లేదు.. ఆర్జీవి
దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ లాక్డౌన్ను పాటిస్తుంటే రాంగోపాల్ వర్మ మాత్రం అందరికీ షాకిచ్చారు. లాక్డౌన్లో సినిమాను పూర్తి చేసి రిలీజ్కు సిద్దమయ్యారు. తాజాగా కరోనావైరస్ అనే సినిమాను లాక్డౌన్లో చిత్రీకరించి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను తీసుకొన్న నిర్ణయంలో ఎలాంటి లొసుగులు లేవన, నిబంధనల ప్రకారమే షూట్ చేశానని చెబుతూ..
లాక్డౌన్లోనే కరోనావైరస్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగానే నేను కరోనావైరస్ సినిమాను చిత్రీకరించాను. సినిమా పరిశ్రమకు సంబంధించిన ఏ యూనియన్ సభ్యుడిని షూటింగ్ కోసం తీసుకోలేదు. ఎవరినీ సంప్రదించలేదు. మా పరిధిలో అన్ని రకాలు జాగ్రత్తలు తీసుకొని సినిమాను షూట్ చేశాం అని రాంగోపాల్ వర్మ ఇటీవల మీడియాతో అన్నారు.
నిబంధనలకు అనుగుణంగానే
కరోనావైరస్ మూవీని లాక్డౌన్ ప్రకటించిన తర్వాత వారం అనంతరం ప్రారంభించాం. ప్రభుత్వం జారీ చేసిన అన్ని రకాల లాక్డౌన్ నిబంధనలు పాటించాం. లాక్డౌన్ ముగిసే లోపునే సినిమాను కంప్లీట్ చేశాం. నిబంధనలకు అనుగుణంగా నడచుకొన్నప్పుడు ఎవరి అనుమతి తీసుకోనవసరం లేదు. తప్పు చేయనప్పుడు ఎవరికి తలవంచనవసరం లేదు అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.
విపత్కర పరిస్థితుల్లో ఇన్నోవేటివ్గా
ఇలాంటి విపత్కర పరిస్థితులను నా ఆలోచనలు, విజన్కు అనుగుణంగా మలచుకొన్నాను. నీ పనిని మరింత ఇన్నోవేటివ్గా చేయడానికి ఈ సమయం కరెక్ట్. అవసరాలు మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తాయి. నిబంధనలు అతిక్రమించలేదు. అందుకే ఎవరి అనుమతి తీసుకోలేదు. కొవిడ్ 19 నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకొన్నాం అని రాంగోపాల్ వర్మ తెలిపారు.
Recommended Video
ఓటీటీ కోసం వెబ్ సిరీస్
అలాగే
క్లైమాక్స్
అనే
చిత్రాన్ని
ఓటీటీ
ఫ్లాట్ఫాంపై
రిలీజ్
చేస్తున్నాను.
మియా
మాల్కోవా
నటించిన
ఈ
మూవీని
శ్రేయాస్ఈటీ
అనే
యాప్లో
రిలీజ్
చేయనున్నాం.
నేను
యూట్యూబ్
కోసం
సినిమా
తీయలేదు.
ఇక
ముందు
ఓటీటీ
కోసం
వెబ్
సిరీస్
చేస్తాను.
త్వరలోనే
ఆర్జీవీ
వరల్డ్
అనే
సొంత
ఫ్లాట్ఫాంను
ప్రారంభించబోతున్నాను
అని
వర్మ
వెల్లడించారు.