Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
జర్నలిస్టులే ఈ గొడవ అంతటకీ మూల కారణం: రామ్ గోపాల్ వర్మ
జర్నలిస్టులు ఈ గొడవకు అంతా కారణమని రామ్ గోపాల్ వర్మ తేల్చి చెప్పారు. అమితా బచ్చన్ కుటుంబంతో తనకు విభేధాలు తలెత్తినట్లు వచ్చిన విషయంపై ఆయన ఇలా స్పందిస్తూ ఖండించారు. ఎప్పుడూ ఏదో వివాదంలో ఉండే వర్మ రీసెంట్ గా దమ్ మారో దమ్ చిత్రంలో అభిషేక్ బచ్చన్ నటనపై కొన్ని కామెంట్స్ చేసారు. అంతేగాక తన కొత్త చిత్రం 'డిపార్ట్మెంట్'లో అభిషేక్ ప్లేసులో రానా ని తీసుకుంటానని అన్నారు. వీటినన్నిటినీ వర్మ పూర్తిగా ఖండించారు. తాను బచ్చన్ కుటుంబానికి గొప్ప గౌరవం ఇస్తానని, అభిషేక్ అంటే తనకు ప్రేమాభిమానాలున్నాయని అయితే డేట్ల సమస్య ఉత్పన్నమైనందువల్ల కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని చెప్పారు. బ్లాగ్లో ఆయన వివరణను ఇచ్చారు. తనకు బచ్చన్ కుటుంబానికి మధ్య స్పర్ధలు సృష్టించేందుకు మీడియా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. గతంలో అమితాబ్ బచ్చన్ నాయకునిగా ఆయన నిర్మించిన 'సర్కార్' విజయవంతం అయింది. బచ్చన్ కుటుంబంతో తన సంబంధాలు చాలా పవిత్రమైనవని ఆయన చెప్పుకువచ్చారు. ఎప్పటికీ అవి అలాగే ఉంటాయన్నారు. అలాగే 'డిపార్ట్మెంట్' చిత్రంలో అభిషేక్ బదులుగా దగ్గుబాటి రాణాను తీసుకోవాలని నిర్ణయించటం వివాదానికి కారణమైనట్లు కనిపిస్తోంది. అభిషేక్కు డేట్లు ఇవ్వటం కష్టమైనందువల్ల మార్పులు చేయాల్సి వచ్చిందని వర్మ అంటున్నారు.