Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'సాక్షి' ఛానెల్ లైవ్ మధ్యలో లేచిపోయిన వర్మ
బెజవాడ రౌడీలు టైటిల్ తో రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రకటించగానే మీడియా మొత్తం ఎలర్టై చర్చా వేదికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ చర్చా వేదికల్లో భాగంగా సాక్షి ఛానెల్ కు వర్మ తన ఇంటినుండే లైవ్ ఇస్తూ పాల్గొన్నారు. స్టూడియోలో ఎవియస్, విజయవాడ నుంచి కాంగ్రేస్ లీడర్ తాడి శకుంతల ఈ డిస్కషన్ లో పాల్గొన్నారు. కొన్ని క్యాజువల్ ప్రశ్నలు అడిగిన తర్వాత తాడి శకుంతల తన గొంతు పెంచి వర్మపై విరుచుకుపడింది. దాంతో వర్మ ఒక్కసారిగా కోపం తెచ్చుకుని తన సీట్ నుంచి లేస్తూ...తాను ఇలాంటి నాన్సెన్స్ ను వినాల్సిన అవసరం లేదని లైవ్ నుంచి తప్పుకున్నారు. అలాగే తాను షూటింగ్ స్పాట్ కు అర్జెంటుగా వెళ్ళాల్సి ఉందని డిస్కషన్ మధ్యలోనే లేచిపోయారు. అప్పటికీ సాక్షి ఏంకర్ చాలా రిక్వెస్ట్ చేసినప్పటికీ వర్మ ఒప్పుకోలేదు.
దానికి తాడి శకుంతల కోపంతో ఊగిపోతూ...ఎంత ధైర్యం ఉంటే వర్మ అలా డిస్కషన్ మధ్యలో లేచి వెళ్తారు...నాకూ చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. అంతెందుకు నేను నా కొడుక్కు ఆరోగ్యం బాగోపోతే హాస్పటిల్ లో పెట్టి అక్కడ నుంచి మాట్లాడుతున్నాను. నా స్దాయి వ్యక్తిని రామ్ గోపాల్ వర్మ అవమానపరుస్ధారా అని కోపంతో ఆమె వర్మపై మండిపడింది.