Don't Miss!
- News కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి? కుమార్తెతో సహా కడియం శ్రీహరి జంప్తో చర్చ!!
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Sports RCB vs KKR: దాన్ని నైట్ రైడర్స్ బ్రేక్ చేయగలదా?
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘26/11’ ఘటనపై వర్మ సినిమా...
ఈ సినిమా గురించి వర్మ మాట్లాడుతూ...''26/11 సంఘటన ఏ భారతీయుడు మరిచిపోని రోజు...అప్పుడు ఉగ్రవాదులు జరిపిన దాడిని లైవ్ టెలికాస్ట్ చూసిన వారి కళ్లలో ఆ సంఘటన ఇప్పటికీ మెదలుతూనే ఉంది. అప్పుడు జరిగిన నరమేధం ఎన్నటికీ మరిచిపోనిది. నా కెరియర్ లోనే ఒక చాలెంజ్ గా తీసుకుని ఈ సినిమా తెరకెక్కించబోతున్నాను'' అని చెప్పారు. కసబ్ మరియు అతని టీం సభ్యులు ముంబైకి ఎలా వచ్చారు అమర్ సింగ్ సోలంకి మరియు ఇతర పోలీసు సిబ్బంది పరిస్థితిని ఎలా కంట్రోల్ చేసారు వంటి అంశాలు చూపించబోతున్నట్లు చెప్పారు. నూతన నటీ నటులతో త్వరలోనే ఈ సినిమా ప్రారంభించాబోతున్నట్లు హిందీ మరియు ఆంగ్ల భాషల్లో తీయబోతున్నట్లు చెప్పారు.
ముష్కర దాడులు జరిగిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్, అతని కొడుకు రితేష్ దేష్ ముఖ్ తో కలిసి దాడికి గురైన తాజ్ హోటల్ను వర్మ సందర్శించారు. అప్పట్లోనే వర్మ ఈ ఘటనపై సినిమా తీస్తున్నట్లు, అందులో రితేష్ దేశ్ ముఖ్ హీరోగా నటింపచేయాలనే ఉద్దేశ్యంతోనే అతన్ని వెంట తీసుకుని సంఘటన స్థలానికి వెళ్లాడని మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అప్పుడు ఆ వార్తలను ఖండించిన వర్మ...తాజాగా ఆ ఘటనపై సినిమా తీయాలని నిర్ణయించుకోవడం గమనార్హం.