20 నుండి షూట్: ఆర్జీవీ స్వీయ దర్శకత్వంలో నాగార్జున మూవీ
రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్లో శివ తర్వాత మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటిగ్ నంబర్ 20 నుండి మొదలవ్వనుంది. ఈ చిత్రానికి వర్మే నిర్మాత.
రామ్ గోపాల్ వర్మ-నాగార్జున కాంబినేషన్లో వచ్చిన "శివ" సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక చెరగని సంతకం. ఈ సినిమా విడుదలై 28 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆ సినిమా కొత్త దర్శకులకు ఇన్స్స్పిరేషన్. వీరి కాంబినేషన్లో తాజాగా మరో సినిమా రాబోతోంది.
రామ్ గోపాల్ వర్మ స్వయంగా నిర్మించనున్న ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 20 నుంచి మొదలవ్వనుంది. "శివ" సినిమా మొదటి షాట్ ను షూట్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే తాజా చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నారు.

రామ్ గోపాల్ వర్మ "కంపెనీ" బ్యానర్ లో ఈ క్రేజీ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఆర్జీవి చిరకాల మిత్రుడు సుధీర్ చంద్ర పడిరి ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరించనున్నారు. ఏప్రిల్ లో చిత్రీకరణ పూర్తి చేసుకొనున్న ఈ అమేజింగ్ మూవీ రిలీజ్ డేట్, టైటిల్ మరియు ఇతర క్యాస్ట్ & క్రూ డీటెయిల్స్ త్వరలోనే రాంగోపాల్ వర్మ వెల్లడిస్తారు!


Click it and Unblock the Notifications











