twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మ తర్వాతి చిత్రం ‘సైకో’

    By Bojja Kumar
    |

    Ram Gopal Varma
    హైదరాబాద్ : ముంబై నగరంపై ముష్కరుల దాడిని '26/11 ఇండియాపై దాడి' పేరుతో తెరకెక్కించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాక్సాపీసు వద్ద మంచి ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత వెను వెంటనే మరో ప్రాజెక్టుతో రెడీ అయ్యారు వర్మ.

    'సైకో' టైటిల్‌తో తానే స్వయంగా కథ రాసుకున్న రామ్ గోపాల్ వర్మ...ఈ చిత్రం ద్వారా కిషోర్ భార్గవ్ అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. మగవారి మూలంగా సమస్యలు ఎదుర్కొంటున్న మహిళల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోంది. కాలిబెర్ ఫిల్మ్ సంస్థ వారు 'సైకో' సినిమాను నిర్మింస్తున్నారు.

    ఈ సినిమా గురించి వర్మ మాట్లాడుతూ 'ఒక మహిళ తన జీవితంలో ఎంతో మంది మగాళ్లను ఎదుర్కొనాల్సి వస్తుంది. వారిలో కొందరు పరిచయస్తులు ఉంటారు. కొందరు స్నేహితులు ఉంటారు. మరికొందరు లైఫ్ పార్ట్నర్స్ ఉంటారు. కానీ కొందరు వారి పట్ల ప్రమాదకరంగా పరిణమిస్తారు. మహిళ జీవితం ఎంతో సున్నితమైనది, వారి జీవితంలో ఒక మగాడు ప్రవేశించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది ఈ సినిమాలో చూపెట్టబోతున్నాం' అన్నారు.

    ప్రస్తుతం నిర్మాత దశలో ఉన్న ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. వర్మ మార్కు సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఇప్పటి సమాజంలోని పోకడలను ఫోకస్ చేస్తూ ఈ సినిమా ఉంటుంది.

    English summary
    
 After the success of 'The Attacks Of 26/11', Ramgopal Varma is working on another project. He said to be providing the story for a film titled 'Psycho'. He is introducing Kishore Bharghav as the director with this film. Nisha Kotari is playing the lead character and Caliber films is producing this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X