Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీరాముడిని దుమ్మెత్తి పోసిన వర్మ, దేవుడెలా అవుతాడని ప్రశ్న
వివాదాస్పదమైన వ్యాఖ్యల ద్వారా ఎప్పటికీ ప్రజల నోళ్లలో నానే అలవాటు దర్శక, నిర్మాత రామ్గోపాల్ వర్మకు అలవాటే. ఎవరినో ఒకరిని లక్ష్యం చేసుకుని వ్యాఖ్యానించి వివాదం రేపడం ఆయనకు ఒక పనిగా మారింది. ఈసారి ఆయన ఏకంగా శ్రీరాముడినే లక్ష్యంగా చేసుకున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆయన శ్రీరాముడినే ప్రశ్నించారు. భార్య కోసం రావణుడిపై వ్యక్తిగత సమరం చేయడం తప్ప అయోధ్య ప్రజలకు శ్రీరాముడు ప్రజలకు ఒరగబెట్టిందేమిటని ఆయన తన ట్విట్టర్లో రాశాడు. అలాంటి రాముడు దేవుడెలా అవుతాడని ఆయన అడిగారు.
దశరథుడు కుమారుడిని అడవులకు పంపి ఎలా ఆదర్శప్రాయుడయ్యాడో అర్థం కాదని రామ్గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. అయోధ్య ప్రజల కన్నా స్వార్థపరురాలైన తన భార్య కోరిక తీర్చడానికే దశరథుడు ప్రాధాన్యం ఇచ్చి రాముడిని అడవులకు పంపిన దశరథుడు స్వర్గానికి ఎలా వెళ్తాడని ఆయన అడిగారు. పతివ్రత సీత తన భర్త రాముడిని అనుసరించినట్లుగా లక్ష్మణుడి భార్య అడవులకు వెళ్లలేదని, అందుకు లక్ష్మణుడి భార్య నరకానికి వెళ్తుందా అని అన్నారు.