Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. మరో బాంబ్ పేల్చిన రామ్గోపాల్ వర్మ
ఎల్లప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ. సినిమాలే గాక పలు ఇంటర్వ్యూల్లో సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించడం ఈయనకే సాటి. ఈ నేపథ్యం లోనే ఇటీవలే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఈయన.. తిరిగి ఇప్పుడు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ మరో సెన్సేషన్కి రెడీ అయ్యాడు.
తన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో ఏ మాత్రం కాంట్రవర్సీ లేదంటూ మొదటి నుంచే చెబుతూ వస్తున్న వర్మ.. ఇప్పటికే ఈ సినిమా అప్డేట్స్ రిలీజ్ చేసి ఆ సినిమాను చర్చనీయాంశం చేసేశాడు. కొందరు రాజకీయ పెద్దలను విమర్శిస్తున్నట్లుగా టీజర్, ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ బయటకు వదిలి సినిమాను హాట్ టాపిక్ చేశాడు. ఈ సినిమాపై, వర్మపై కేసు కూడా నమోదైంది. దీంతో అందరి చూపు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై పడింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా సమావేశం నిర్వహించిన వర్మ.. తన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా గురించి మరో బాంబ్ పేల్చాడు. ఈ సినిమా పూర్తి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అని చెప్పి షాకిచ్చాడు. తాను ఎవ్వరినీ టార్గెట్ చేయలేదని, అలాగే తనకు ఎవ్వరి దగ్గరి నుంచీ ఎలాంటి బెదిరింపులు రాలేదని వర్మ చెప్పాడు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో ఏ వర్గాన్ని తక్కువచేసి చూపించలేదని ఈ సందర్బంగా వర్మ పేర్కొన్నాడు. నవంబర్ 29న ఈ సినిమా విడుదల కానుంది.