Don't Miss!
- Sports T20లో డబుల్ సెంచరీ: ఆ భారత ప్లేయర్కే సాధ్యం- విలియమ్సన్
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బెస్ట్ కాంప్లిమెంట్: ఎన్టీఆర్ నిజమైన కుమారుడు రామ్ గోపాల్ వర్మ!
'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ ఏపీలో విడుదల కాకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ స్టే విధించడంతో ఆ రాష్ట్రంలో రిలీజ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇది నాకు వెన్నుపోటు కాదు.. ఎన్టీ రామారావుకు తిరిగి మరొకసారి వెన్నుపోటు. ఆయన ఆ రోజు సింహగర్జన సభ పెట్టుకోకుండా రకరకాల ప్రయత్నాలు చేసి మానసిక క్షోభకు గురి చేసి చంపేశారు . ఈ రోజు ఆయన మీద తీసిన సినిమా రిలీజ్ అవ్వకుండా మళ్లీ వెన్నుపోటు పొడిచారని వర్మ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు వర్మ రియాక్ట్ అవుతూ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
సినిమాతో ఎన్నికలను ప్రభావితం చేయాలనేది మా ఉద్దేశ్యం కాదు
ఈ సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయి, నా సినిమాలో ఉన్న క్యారెక్టర్లు ఇప్పుడు ఉన్నారుకాబట్టి ఫిల్మ్ మేకర్స్గా హైప్ తీసుకొచ్చే ప్రయత్నమే కానీ... మా సినిమాతో ఎన్నికలను ప్రభావితం చేయాలనేది మా ఉద్దేశ్యం కాదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ద్వారా మేము చెప్పింది నిజమైన స్టోరీ. క్రియేటెడ్, ఫిక్షనల్ స్టోరీ కాదని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.
వెధవనే కానీ, మీరు అనుకున్నంత పెద్ద వెధవను కాదు
ఎయిర్పోర్టులోకి అనమతించలేదని కోపంతో ఎన్టీఆర్ అప్పట్లో ఓపార్టీ పెట్టారు. సినిమాను ఆపేసిన కోపంతో మీరు పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఉందా?... అనే ప్రశ్నకు వర్మ స్పందిస్తూ... ‘నేను వెధవనే కానీ, మీరు అనుకున్నంత పెద్ద వెధవను కాదు.' అంటూ సమాధానం ఇచ్చారు.
నా సినిమా కొంత మంది నమ్మకం మీద దెబ్బ పడొచ్చు
సినిమా అనేది ఒక ఎమోషన్ తీసుకొస్తుంది. నేను తీసింది చూసి ఇలా జరిగిందా? అని మీరు నమ్మితే తప్పకుండా మీకు అంతకు ముందు కొంత మంది మీద ఉన్న ఇంప్రెషన్ పోవచ్చు. ఎన్నికలు అనేది నమ్మకం మీద నడుస్తాయి. నా సినిమా కొంత మంది నమ్మకం మీద దెబ్బ పడొచ్చు. అయితే ఎంత పడుతుంది? అనేది నేను చెప్పలేను. కానీ నిజం అనేది ఎప్పటికీ నిజమే.... అని వర్మ తెలిపారు.
చివరి 4 నెలల్లో తీవ్రమైన వేదన పడ్డారు
ఎన్టీ రామారావు 70 ఏళ్లు మహారాజులాగా బ్రతికారు. చివరి 4 నెలల్లో తీవ్రమైన వేదన పడ్డారు. దానికి నేను చాలా చాలా కనెక్ట్ అయ్యాను. ఎన్టీ రామారావు చనిపోవడానికి వారం రోజుల ముందు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయాల ఆధారంగా సినిమాలో కొన్ని అంశాలు చూపించాం. నిజాన్ని ఎవరూ దాచలేరని వర్మ తెలిపారు.
మీరు నమ్మిన దానితో మరో సినిమా తీసుకోండి
నేను నమ్మిన విషయాల ఆధారంగా సినిమాగా తీశాను. మీరు ఇలా జరుగలేదు అని అనుకుంటే మీరు నమ్మిన దానితో మరో సినిమా తీసుకోండి అంటూ వర్మ తనదైన శైలిలో స్పందించారు.
‘నువ్వు ఎన్టీఆర్ గారి నిజమైన కుమారుడిని' అనేది నా లైఫ్లో బెస్ట్ కాంప్లిమెంట్
సినిమా విడుదలైన తర్వాత నా లైఫ్లో బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది. ‘నువ్వు ఎన్టీఆర్ గారి నిజమైన కుమారుడిని' అంటూ ఓ వ్యక్తి మెసేజ్ పంపారు అని వర్మ చెప్పుకొచ్చారు.
ఏపీలో ఉన్న తెలుగు వారికి నేడు బ్లాక్ డే
నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ... ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఈ రోజు శుభదినం. కానీ ఏపీలో ఉన్న వారికి బ్లాక్ డే. నిజం ఉంది కాబట్టే భయపడి వాళ్లు సినిమాను ఆపుతున్నారు. న్యాయం గెలుస్తుందనే నమ్మకం ఉంది. సుప్రీం కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని అనుకుంటున్నాం. ప్రభుత్వం, కొంత మంది నాయకులు వాళ్ల స్వలాభం కోసం ఇదంతా చేస్తున్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే వారికి బుద్ది చెబుతారు. సినిమా ఆపడం వల్ల నాకేమీ నష్టం లేదు. మా ఆర్జీవీగారు వెయ్యి కోట్ల విలువచేసే పేరు తీసుకొచ్చారని తెలిపారు.