Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రామ్ గోపాల్ వర్మ సినిమాకు సెన్సార్ పూర్తి.. త్వరలోనే రిలీజ్ డేట్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా సినిమా బ్యూటిఫుల్. ట్రిబ్యూట్ టు రంగీలా అనేది ట్యాగ్ లైన్. టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై అగస్త్య మంజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. చిత్రంలో నైనా హీరోయిన్ గా నటించగా, సూరి హీరోగా నటించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తాజా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా A సర్టిఫికెట్ పొందింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పిన చిత్రయూనిట్ .. అతిత్వరలో విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని పేర్కొంది. రొమాంటిక్ ప్రేమ కథగా వైవిధ్య భరితమైన సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త లోకం పరిచయం చేయనున్నాం అని అంటున్నారు యూనిట్ సభ్యులు.
మరోవైపు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సెన్సార్ కష్టాలు ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని అంటున్నారు సెన్సార్ సభ్యులు. దీంతో నవంబర్ 29నే విడుదల కావాల్సిన ఈ సినిమా ఆగిపోయింది. చూడాలి మరి వర్మ బ్యూటిఫుల్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఏయే తేదీల్లో విడుదలవుతాయి అనేది. ఈ రెండు సినిమాలతో గత కొని రోజులుగా వర్మ అంశం హాట్ టాపిక్ అవుతోంది.