Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వర్మ పోటీకి లక్ష 80 వేల మంది ఎన్ రోల్
రామ్ గోపాల్ వర్మ 'ఆవహం' చిత్రాన్ని ఒంటరిగా చూసిన వారికి 5 లక్షల బహుమతి ఇస్తామని పోటీ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పోటీకి భారీ ప్రతిస్పందన లభించిందని, దాదాపు ఒక లక్ష, 80 వేల మంది ఈ పోటీకి ఎన్ రోల్ చేసుకన్నారని నిర్మాత బుర్రా ప్రశాంత్ చెప్తున్నారు. అలాగే వీరిలో ఒకరిని సినిమా చూసేందుకు ఎంపిక చేయనున్నాం. ఒక్క వ్యక్తి చూసే ప్రదర్శన ముంబైలో జరుగుతుంది ఆయన అన్నారు. 'ఫూంక్-2' చిత్రం తెలుగులో 'ఆవహం' పేరుతో డబ్బింగై రిలీజవుతోంది.
'ఆవహం' చిత్రాన్ని ఈనెల 16వ తేదీన తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దేశవ్యాప్తంగా 1200 థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మిలింద్ గదగ్కర్ మాట్లాడుతూ, 'సుఖాంతమైన 'ఫూంక్' చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం ఉంటుంది. ఆ చిత్రంలో చనిపోయిన మంత్రగత్తె దయ్యమైతే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కథాంశం అన్నారు. అలాగే రామ్ గోపాల్వర్మ హిందీలో రూపొందించిన చిత్రాలకు రచయితగా పనిచేసిన తనకిది దర్శకుడిగా తొలి చిత్రమని మిలింద్ గదగ్కర్ తెలిపారు.