Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
నోరు మూసుకొంటే మీ ఖర్మ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి.. నాని, సిద్దార్థ్, సినీ ప్రముఖులపై ఆర్జీవీ ఫైర్
సినిమా టికెట్లు, ప్రత్యేక షోల ప్రదర్శన విషయంలో ఏపీకి, సినిమా పరిశ్రమకు జరుగుతున్న వివాదంలోకి రాంగోపాల్ వర్మ తలదూర్చడమే కాకుండా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలోని ప్రముఖుల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. వాళ్లకు సమస్యలపై పట్టింపు లేదు. వాటిపై ఘాటుగా స్పందించాలనే ఇంట్రెస్టు కూడా లేదనిపిస్తుంది. సినీ హీరో నాని, సిద్దార్థ్ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ రాంగోపాల్ వర్మ తప్పుపట్టారు. తాజా వీడియోలో సినీ ప్రముఖులను ఉద్దేశించి..
సినిమా థియేటర్ కౌంటర్ కంటే బడ్డీ కోట్టు కౌంటర్ బాగుందని నాని అంటాడు. మీరు సంపాదించడం లేదా అని హీరో సిద్దార్థ్ అంటారు. నేను దొంగ.. నీవు దొంగ అనే కామెంట్లు కాదు. కొంచెం బుర్ర పెట్టి మాట్లాడాలి. సమస్యను ఎలుగెత్తి ప్రభుత్వాన్ని నిలదీయాలి. పాయింట్ టూ పాయింట్ మాట్లాడితే ఐదు నిమిషాల్లో తేల్చిపడేసే విషయం అని రాంగోపాల్ వర్మ అన్నారు.
అధికారం ఇస్తే.. మా తలపై కూర్చోకండి.. మంత్రి పేర్ని నానిపై రాంగోపాల్ వర్మ ప్రశ్నల వర్షం
సినీ నటులు, రాజకీయ నేతలు సమస్యను పరిష్కరించకుండా యూట్యూబ్లో ఎంటర్టైన్మెంట్ షోగా మార్చేస్తున్నారు. మా సమస్యలు ఇవి.. మా సూచనలు ఇవి అనే విషయం గురించి సినీ ప్రముఖులు ఎందుకు ఆలోచించడం లేదు అని రాంగోపాల్ వర్మ అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో సినీ ప్రముఖులు, నా తోటి సహచరులకు ఒకటే విన్నపం. టికెట్ రేట్ల వివాదంపై తమ అభిప్రాయాలను, తమ ఫీలింగ్స్ను నిక్కచ్చిగా మాట్లాడాలని టాలీవుడ్ కొలిగ్స్ను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు మాట్లాడలేకపోతే.. ఇప్పుడు నోర్లు మూసుకొంటే.. ఇంకెప్పుడు తెరువలేరు. తర్వాత మీ ఖర్మ అంటూ రాంగోపాల్ వర్మ ఘాటైన ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే.. సోమవారం రాత్రి ప్రముఖ టెలివిజన్ ఛానెల్లో మంత్రి పేర్ని నాని తర్వాత చర్చలో పాల్గొన్న తర్వాత వరుసగా వీడియోలను, సీరియల్ ట్వీట్లతో సోషల్ మీడియాను హోరెత్తించారు. మంత్రి పేర్ని నాని, ఏపీ ప్రభుత్వాన్ని కడిగిపడేసినంత పనిచేశారు. అంతేకాకుండా పలు ప్రశ్నలతో కూడిన వీడియోలను షేర్ చేశారు.