Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చంద్రబాబు, లోకేష్, జగన్ అందరినీ వాడుకుంటున్న వర్మ! ఫొటోలతో దుమారం.. ఇదీ పరిస్థితి
రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా విడుదలవుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో సెన్సార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ సినిమా అప్డేట్స్ ఇస్తూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరో దుమారం లేపారు. చంద్రబాబు- లోకేష్, జగన్- విజయ్ సాయి రెడ్డి ఫొటోలు పోస్ట్ చేస్తూ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు చూద్దామా..
వర్మ బాగానే స్కెచ్ వేశారు కానీ..
గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాలకు చుక్కలు చూపిస్తున్నారు వర్మ. ఈ నేపథ్యంలోనే ఇటీవలే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో సంచలనం సృష్టించిన ఆయన.. ఈ సారి 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేయాలని భావించారు. కానీ చివరి క్షణంలో ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడటం, సెన్సార్ అభ్యంతరాలు లాంటివి జరిగాయి.
|
పేరు మార్చిన వర్మ.. రిలీజ్కు రెడీ
చివరకు తన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా పేరును 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు'గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు వర్మ. అయినప్పటికీ సెన్సార్ బోర్డు కరుణించలేదు. ఎన్నో ఆటుపోట్ల తర్వాత చివరకు ఈ సినిమా రిలీజ్కు రెడీ అయింది. 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' సినిమా డిసెంబర్ 12వ తేదీన విడుదల కానుంది.
తనను తాను అలా పోల్చుకున్న వర్మ
ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కోసమై మరికొన్ని ఫొటోలు షేర్ చేస్తూ సంచలనం సృష్టించారు రామ్ గోపాల్ వర్మ. తనను తాను బాహుబలిగా పోల్చుకుంటూ తన 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' సినిమాను డిసెంబర్ 12వ తేదీన విడుదల చేయడానికి మోసుకొస్తునట్లుగా ఫొటో షేర్ చేశారు వర్మ.
|
రిలీజ్ ఫిక్స్.. ఆ ఇద్దరి సంబరాలు
అంతేకాదు 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' డిసెంబర్ 12న రిలీజ్ కానుండడంతోవైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి సంబరాలు చేసుకుంటున్నట్టుగా ఓ ఫొటోను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు వర్మ. వారిద్దరూ ఒకరినొకరు హత్తుకుని ఆనందంలో ఉన్నట్లుగా ఉన్న ఆ ఫొటోలో.. వారి వెనుక టీవీ స్క్రీన్ మీద 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమా డిసెంబర్ 12న రిలీజ్ అవుతున్నట్టు బ్రేకింగ్ న్యూస్ అని రాసి పెట్టి ఉంది. అయితే వారిద్దరూ తనకు తెలియదని, వారు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో కూడా తెలియదని వర్మ పేర్కొనడం విశేషం.
Recommended Video
|
చంద్రబాబు, లోకేష్, జగన్ అందరినీ వాడుకుంటున్న వర్మ
నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ లతో కూడిన మరో ఫొటో పోస్ట్ చేస్తూ ఆ సందర్భం తెలుసుగానీ గుర్తురావడం లేదంటూ మరో ట్వీట్ చేశారు వర్మ. మొత్తానికి ఇలా చంద్రబాబు నాయుడు, లోకేష్, జగన్ అందరినీ తన సినిమా ప్రమోషన్స్ కోసం భలే వాడుకుంటున్నారు వర్మ.