చనిపోయిన శ్రీదేవితో రాంగోపాల్ వర్మ.. కారులో ఆ పని చేస్తూ ఘోరంగా!
సినిమాల్లోకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు పోతుంటారు. కానీ, కొందరు మాత్రమే ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేస్తూ సెన్సేషన్గా మారుతుంటారు. అలాంటి వారిలో రాంగోపాల్ వర్మ ఒకరు. తనదైన సినిమాలతో టాలీవుడ్లో ప్రభావాన్ని చూపించిన ఆయన.. ఈ మధ్య కాలంలో పద్దతిని మార్చుకున్నాడు.
ఇలా ఈ ఇటీవలి కాలంలో కాంట్రవర్శీ మూవీలనే ఎక్కువగా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలోనూ ఊహించని ఫొటోలను వదులుతున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా రాంగోపాల్ వర్మ ఓ షాకింగ్ పిక్ను షేర్ చేశాడు. దానిపై మీరు కూడా లుక్కేయండి!

కాంట్రవర్శీకే ప్రాధాన్యత
రాంగోపాల్ వర్మ తన దర్శకత్వ ప్రయాణంలో ఎన్నో భారీ, ఉన్నతమైన సినిమాలను చేశాడు. అయితే కొంత కాలంగా రాజకీయ నేపథ్యం ఉన్న బయోపిక్కులు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 'రక్త చరిత్ర', 'వంగవీటి', 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు', 'పవర్ స్టార్', 'వ్యూహం', 'శపథం' వంటివి తీస్తూ రాజకీయ దుమారాన్నే రేపుతున్నాడు.

బోల్డు మూవీలూ తీస్తూనే
రాంగోపాల్ వర్మ ఈ మధ్యన వివాదాస్పద చిత్రాలను మాత్రమే కాదు.. హాట్ హాట్ మూవీలనూ రూపొందిస్తున్నాడు. ఇప్పటికే అతడు 'క్లైమాక్స్', 'నగ్నం', 'డేంజరస్', 'జీఎస్టీ', 'లడ్కీ', 'డేంజరస్' వంటి హాట్ హాట్ మూవీలను తెరకెక్కించాడు. వీటికి సెన్సార్ చిక్కులు ఎదురు కావడంతో కొన్నింటిని ఓటీటీ ఫ్లాట్ఫాంల ద్వారా విడుదల చేసి ఖుషీ చేస్తున్నాడు.
అమ్మాయిలతో హల్చల్
తక్కువ సమయంలోనే సినిమాలు తెరకెక్కించే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఈ మధ్య తాను హైలైట్ చేసిన హీరోయిన్లతో కలిసి రెచ్చిపోతోన్నాడు. ఈ క్రమంలోనే వాళ్లతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. మరీ ముఖ్యంగా అప్సరా రాణి, నైనా గంగూలీ వంటి వారితో ఆర్జీవీ తరచూ పార్టీలు చేసుకుంటుంటాడు. అలాగే, అషు రెడ్డి, ఆరియానా వంటి వాళ్లతో హల్చల్ చేస్తున్నాడు.

అందులో యమా బిజీ
రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. చాలా కాలంగా అతడు తరచూ ట్వీట్లు, పోస్టులు పెడుతూ వివాదాల్లో భాగం అవుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని రాజకీయ పార్టీలను సైతం టార్గెట్ చేస్తున్నాడు. అంతేకాదు, ఎక్కువగా హీరోయిన్ల గ్లామర్ను చూపిస్తూ తీసిన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ నిత్యం హాట్ టాపిక్ అవుతోన్నాడు.
శ్రీదేవితో అలాంటి ఫొటో
సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తరచూ అమ్మాయిల ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ఉంటాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన తన X లేదా ట్విట్టర్ ఖాతాలో అలనాటి అందాల తార శ్రీదేవితో కలిసి తీసుకున్న ఫొటోను వదిలాడు. దీంతో ఇది చూసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు. ఫలితంగా ఇది బాగా వైరల్ అయిపోతోంది.

అసలు విషయం అదే
రాంగోపాల్ వర్మ తాజాగా షేర్ చేసిన శ్రీదేవి ఫొటో మార్ఫింగ్ చేసిందే అని చెప్పొచ్చు. వాస్తవానికి అతడు రెండు రోజుల క్రితమే ఓ వ్యక్తితో కారులో ప్రయాణిస్తూ, సిగరెట్ కాలుస్తూ తీసుకున్న ఫొటోను వదిలాడు. అందులో పక్క వ్యక్తికి శ్రీదేవి ముఖం పెట్టి మార్పింగ్ చేశారు. ఈ పిక్నే ఇప్పుడు వర్మ షేర్ చేశాడు. ఇక, దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











